Categories: LatestNewsPolitics

Nagababu: పొత్తులపై పవన్ కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్

Nagababu: ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తోన్న జనసేన పార్టీ నెమ్మదిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. తమకున్న బలం, అవకాశాలు చెక్ చేసుకొని కచ్చితంగా గెలుస్తామనుకునే నియోజకవర్గాలపై ముందుగా ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే పార్టీ వ్యవహారాలకి పవన్ కళ్యాణ్ నాగబాబుకి అప్పగించారు. నాదెండ్ల మనోహర్, నాగబాబు జిల్లాల వారీగా తిరుగుతూ క్యాడర్ తో మాట్లాడుతూ జనసేనాని వ్యూహాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పార్టీలో బలమైన అభ్యర్ధులని గుర్తించడంపై దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలెట్టే సరికి కచ్చితంగా వంద స్థానాల వరకు తమ బలం పెంచుకోవాలని జనసేనాని భావిస్తున్నారు.

వారాహి యాత్ర ద్వారా మరింతగా బలం పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. అయితే ప్రత్యర్ధి పార్టీలైన వైసీపీ, టీడీపీ మైండ్ గేమ్ ఆడుతూ జనసేన క్యాడర్ ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. జనసైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు. అయితే పొత్తు ఖాయం అయిపోయింది అని టీడీపీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసే బాధ్యత తీసుకున్నాడు అని వైసీపీ ప్రచారం చేస్తూ జనసైనికులని భయపెడుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ వైపు నిలబడతామని అనుకుంటున్న వారిని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నాగబాబు ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. తాజాగా అనకాపల్లి జిల్లా యలమంచిలిలో రాంబిల్లిలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తులపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని, గతంలో పోల్చుకుంటే మనబలం పెరిగిందని, దానికి తగ్గట్లుగా మన డిమాండ్లకి అంగీకరిస్తే పొత్తులు ఉంటాయని అన్నారు. అధినేత ఎవరిని నిలబెడితే వారిని గెలిపించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. పొత్తులు ఉంటే అధినేత నేరుగా చెబుతారని, పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న పార్టీ ఎదుగుదలని దృష్టిలో పెట్టుకొని బలమైన నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. నాగబాబు వ్యాఖ్యలు ఇప్పుడు జనసైనికులకి ఉత్సాహాన్ని ఇచ్చాయి.

Varalakshmi

Recent Posts

Politics: కవిత ఎంట్రీ.. వైసీపీలో కొత్త టెన్షన్!

Politics: రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. అయితే ఈసారి పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి వినిపించిన…

11 minutes ago

Political: తెలంగాణలో ఏపీ కూటమి స్కెచ్.. కేసీఆర్, రేవంత్ కు షాక్ త‌ప్ప‌దా?

Political: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఊపు ఊపేసిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఇప్పుడు తెలంగాణ వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే…

3 hours ago

Mangoes weight Loss: మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారా? అసలు విషయం ఏంటంటే?

Mangoes weight Loss: వేసవికాలం వచ్చింది అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పండ్లు మామిడి పండ్లు. మామిడి పండ్ల…

4 hours ago

TDP PARTY: టీడీపీకి రాజ్యసభ గండం.. లోకేష్ ఎంట్రీతో సీన్ మారుతుందా?

TDP PARTY: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సైరన్ మోగడంతో పచ్చ చొక్కాల లీడర్లలో కొత్త జోష్ రావాల్సింది పోయి, పాత…

5 hours ago

Telangana: జనసేన సభకు నో పర్మిషన్.. రూటు మార్చిన‌ పవన్..!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…

6 hours ago

Andhra Pradesh: రాపాక, ఆమంచి.. ఈ ఇద్ద‌రు ఏ పార్టీలో ఉన్నార‌బ్బా..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…

7 hours ago

This website uses cookies.