MLC Elections: ఏపీలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ఉంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలని వైసీపీ కోల్పోయింది. ఇక మిగిలిన టీచర్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధులని గెలుచుకుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధులకి పోలింగ్ ప్రారంభమైంది. తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా ఇందులో వైఎస్సార్సీపీకి పోతే 154 మంది సభ్యులున్నారు. టీడీపీకి అధికారికంగా 23 మంది, జనసేనకు ఒకరు ఉన్నారు అయితే కొన్నాళ్లుగా నలుగురు సభ్యులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు.
దీంతో టీడీపీకే 19 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అలాగే జనసేనకు ఉన్న ఒక్క సభ్యులు కూడా పార్టీకి దూరమయ్యారు. ఒక ఎమ్మెల్సీకి రావడానికి 28 మంది ఓట్ల అవసరం ఉంటుంది. వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను బరిలో దించింది 19 మంది సభ్యులు ఉన్న టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. మొత్తం 8 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. అయితే వీరిలో ఆరు స్థానాలు వైసీపీ గెలుచుకోవడం ఖాయం కాగా ఆ ఒక్క స్థానం మాత్రం చాలా కీలకం కానుంది. దీనిని కూడా అధికార పార్టీ సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే టీడీపీ మాత్రం ఒక్క స్థానం సొంతం చేసుకోవాలని భావిస్తుంది. టీడీపీ రెబల్ గా ఉన్న ఎమ్మెల్యేలకి ఇప్పటికి పార్టీలోనే ఉండటంతో విప్ జరీ చేసి వారు వైసీపీకి ఓటు వేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదించడం జరిగిందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఆయన ఓటు కూడా చెల్లకొండ అడ్డుకున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు అంటూ టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరి ఈ ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందా లేదంటే టీడీపీకి ఒక్క స్థానం వదులుకుంటుందా అనేది చూడాలి.
Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…
Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
This website uses cookies.