Politics: జనసేనాని యాత్రకి వైసీపీ… మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలతో క్లారిటీ

Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో రానున్న ఎన్నికలే లక్ష్యంగా వారాహి వెహికల్ తో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇక తన యాత్ర కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన బస్సుని సిద్ధం చేసుకున్నారు. ఇక ఈ బస్సుని వారం రోజుల క్రితం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇక బస్సు ఫోటోలు షేర్ చేసి వారాహి యుద్ధానికి సిద్ధం అంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా వింగ్, నాయకులు ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరికి తెలిసిందే. ఇక వైసీపీ విమర్శలపై జనసేనాని కూడా ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. అయితే తాజాగా వైసీపీ తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ వారు అందరూ షాక్ అయ్యే వార్త బయటకి వచ్చింది.

15 రోజుల క్రితమే వారాహి వాహనానికి హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. ఈ విషయాన్ని ఆర్టీవో కమిషనర్ తాజాగా మీడియాకి క్లారిటీ ఇచ్చారు. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ కి వచ్చినపుడు అది పవన్ కళ్యాణ్ వెహికల్ అనే విషయం తెలియదని చెప్పారు. ఇక వాహనం నిబంధనలకి అనుగుణంగా ఉందని, రంగు విషయంలో కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చేశారు. ఆర్మీ వాహనాలకి ఉపయోగించే రంగుకి వారాహి రంగుకి వ్యత్యాసం ఉందని చెప్పారు. అలాగే అన్ని నిబంధనలకి లోబడి ఉండటంతో రిజిస్ట్రేషన్ జరిగిపోయిందని, నెంబర్ కూడా కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు.

ఇక వారాహి వాహనం రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారికంగా కన్ఫర్మ్ కావడంతో మీడియాలో కూడా ఈ వార్త హైలైట్ అయ్యింది. అయితే వాహనంపై తప్పుడు ప్రచారం చేసి రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపాలని వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయనే మాట వినిపిస్తుంది. అయితే ఆ వాహనంతో ప్రచారం నిర్వహించాబోయేది ఏపీలోనే కాబట్టి ఇక బస్సు యాత్ర మొదలు పెట్టడానికి ముందే తమకున్న అధికారాన్ని ఉపయోగించి ఏవో కొన్న నిబంధనలు తీసుకురావాలని వైసీపీ సర్కార్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద తప్పుడు ప్రచారం చేయడంతో పాటు, ఏపీలో ఆర్టీఐ నిబంధనలకి లోబడి ఉంటేనే వారాహి ఇక్కడ రహదారులపై తిరుగుతుందని మంత్రి అమర్నాథ్ విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు. దీని ద్వారా కచ్చితంగా ఏపీలోఆర్టీఐ నిబంధనలు అంటూ ఏదో ఒక రకంగా ఆరంభంలోనే బస్సు యాత్రకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం వైసీపీ చేస్తుందనే ప్రచారం రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

బస్సు యాత్ర ప్రారంభమైన యాత్ర మధ్యలో ఏదో ఒక కారణం చూపించి అడ్డుకునే ప్రయత్నం కూడా జరగొచ్చని కూడా వైసీపీ నాయకుల మాటల బట్టి అర్ధం అవుతుంది. ఏపీలో టీడీపీ, జనసేనకి యాత్రలు చేసే అవకాశం ఇవ్వమని, కచ్చితంగా అడ్డుకుంటామని సోషల్ మీడియాలో, అలాగే నాయకులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. దీనిని బట్టి ఏపీలో పవన్ కళ్యాణ్ ని వీలైనన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం ద్వారా జనసేనని టీడీపీకి దూరం చేసి ఒంటరిగా పోటీ చేసేలా చేయాలని వైసీపీ వ్యూహంలో భాగంగా ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

2 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

2 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.