Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా మంచి ఎదుగుదల రావడం కోసం ఎంతో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలామంది పెద్దవాళ్లు గర్భం దాల్చిన మహిళలు చేప తినకూడదని చేప తింటే బిడ్డ చర్మం కూడా చేప పొలుసులాగా ఉంటుంది అంటూ చెబుతూ ఉంటారు కానీ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని వైద్య నిపుణులు కొట్టి పారేస్తున్నారు.
మరి గర్భం దాల్చిన మహిళలు చేపలను ఆహారంగా తీసుకోవచ్చా తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే.. చేపలు ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి అయితే గర్భం దాల్చిన మహిళలు చేపలు తినటం వల్ల పుట్టబోయే పిల్లలలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వచ్చే అవకాశాలు 20% తగ్గిపోతాయని చెబుతున్నారు. ఇక మెదుడు ఎదుగుదలకు కూడా చేపలు ఎంతగానో దోహదం చేస్తాయి.
చేపలలో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఆటిజం సమస్యను తగ్గిస్తున్నాయని వైద్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఇక పిండం ఎదుగుదలకు కూడా చేపలు ఎంతగానో దోహదం చేస్తాయి కనుక వారంలో కనీసం ఒక్కసారైనా చేపలను వారి ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేపలు తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది కనుక ఇకపై ఎలాంటి అపోహలు లేకుండా గర్భిణీ స్త్రీలు చేపలను వారి ఆహారంలో భాగం చేసుకోవటం ఎంతో ముఖ్యం.
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
International Yoga Day 2026: ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక…
Puranapanda Srinivas: హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా…
This website uses cookies.