Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా మంచి ఎదుగుదల రావడం కోసం ఎంతో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలామంది పెద్దవాళ్లు గర్భం దాల్చిన మహిళలు చేప తినకూడదని చేప తింటే బిడ్డ చర్మం కూడా చేప పొలుసులాగా ఉంటుంది అంటూ చెబుతూ ఉంటారు కానీ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని వైద్య నిపుణులు కొట్టి పారేస్తున్నారు.
మరి గర్భం దాల్చిన మహిళలు చేపలను ఆహారంగా తీసుకోవచ్చా తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే.. చేపలు ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి అయితే గర్భం దాల్చిన మహిళలు చేపలు తినటం వల్ల పుట్టబోయే పిల్లలలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వచ్చే అవకాశాలు 20% తగ్గిపోతాయని చెబుతున్నారు. ఇక మెదుడు ఎదుగుదలకు కూడా చేపలు ఎంతగానో దోహదం చేస్తాయి.
చేపలలో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఆటిజం సమస్యను తగ్గిస్తున్నాయని వైద్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఇక పిండం ఎదుగుదలకు కూడా చేపలు ఎంతగానో దోహదం చేస్తాయి కనుక వారంలో కనీసం ఒక్కసారైనా చేపలను వారి ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేపలు తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది కనుక ఇకపై ఎలాంటి అపోహలు లేకుండా గర్భిణీ స్త్రీలు చేపలను వారి ఆహారంలో భాగం చేసుకోవటం ఎంతో ముఖ్యం.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.