Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా మంచి ఎదుగుదల రావడం కోసం ఎంతో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలామంది పెద్దవాళ్లు గర్భం దాల్చిన మహిళలు చేప తినకూడదని చేప తింటే బిడ్డ చర్మం కూడా చేప పొలుసులాగా ఉంటుంది అంటూ చెబుతూ ఉంటారు కానీ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని వైద్య నిపుణులు కొట్టి పారేస్తున్నారు.
మరి గర్భం దాల్చిన మహిళలు చేపలను ఆహారంగా తీసుకోవచ్చా తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే విషయానికి వస్తే.. చేపలు ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి అయితే గర్భం దాల్చిన మహిళలు చేపలు తినటం వల్ల పుట్టబోయే పిల్లలలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వచ్చే అవకాశాలు 20% తగ్గిపోతాయని చెబుతున్నారు. ఇక మెదుడు ఎదుగుదలకు కూడా చేపలు ఎంతగానో దోహదం చేస్తాయి.
చేపలలో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఆటిజం సమస్యను తగ్గిస్తున్నాయని వైద్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. ఇక పిండం ఎదుగుదలకు కూడా చేపలు ఎంతగానో దోహదం చేస్తాయి కనుక వారంలో కనీసం ఒక్కసారైనా చేపలను వారి ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేపలు తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది కనుక ఇకపై ఎలాంటి అపోహలు లేకుండా గర్భిణీ స్త్రీలు చేపలను వారి ఆహారంలో భాగం చేసుకోవటం ఎంతో ముఖ్యం.
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…
This website uses cookies.