Biogas: ప్రపంచంలో రోజు రోజుకి వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. ఓ వైపు పరిశ్రమల నుంచి విపరీతమైన కాలుష్యం వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. మరో వైపు మానవ అవసరాల కోసం తయారు చేసుకున్న వాహన యంత్రాలు ద్వారా కూడా విపరీతమైన కాలుష్యం పెరిగిపోతుంది. ఈ వాహన వినియోగం ప్రజల అవసరాలలో భాగం అయిపోయాయి. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవారు ఇప్పుడు బైక్ మీద తిరుగుతున్నారు. ఒకప్పుడు బైక్ లు వాడేవారు ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. ప్రపంచంలో జనాభాతో సమానంగా వాహనాలు కూడా ఉన్నాయి. వీటి నుంచి ఏ స్థాయిలో కాలుష్యం బయటకి పంపింగ్ అవుతుందో అంచనా వేయడం కష్టం.
ఇక కాలుష్యం కారణంగా ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే కోట్లాది మంది ప్రజలు రకరకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచం మరింత అడ్వాన్స్ అవుతున్న కొద్ది వాహనాల కోసం ఉపయోగించే ఇంధనం విషయంలో మరింత కేర్ ఫుల్, వాతావరణంలో మార్పులని దృష్టిలో ఉంచుకొని ఆటోమొబైల్ దిగ్గజాలు వాహనాలని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పెట్రోల్, డిజిల్ ఇంధనాలతో నడిచే వాహనాలు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ఎలక్ట్రికల్ వెహికల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో ఉన్న చిన్న చిన్న లోపాలని అధికమిస్తూ మరింత బెటర్ వెర్సన్స్ ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
భారత్ లో ప్రస్తుతం రోడ్లపై పరుగులు తీస్తున్న సీఎన్జీ కార్లలో 70 శాతం మారుతి సుజుకి సంస్థకు చెందినవి ఉండటం విశేషం. ఇక ఈ మోడల్స్ ఇండియాలోనే కాకుండా ఆఫ్రికా, జపాన్ లలో కూడా నడుస్తున్నాయి. భవిష్యత్తులో కార్భన్ ఉద్గారాలని తగ్గించే దిశగా ఆటోమొబైల్ రంగం అడుగులు వేస్తుందని, అందులో బయోగ్యాస్ అతిపెద్ద ఇంధనంగా ఎలక్ట్రిసిటీ తర్వాత మారుతుందని మారుతి సుజుకి పేర్కొంది. దీనికోసం ఇప్పటికే బయో గ్యాస్ ఉత్పత్తి కోసం ఇండియాలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, బనాస్ డెయిరీతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. అలాగే ఆవుపేడతో తయారయ్యే ఇంధనం తయారు చేసే కంపెనీతో జపాన్ లో ఒప్పందం చేసుకున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఈ బయోగ్యాస్ ని ఇంధన వనరుగా గ్రామీణ ప్రాంతాలలో విరివిగా ఉపయోగించే వారు. మళ్ళీ దాంతో నడిచే కార్లని మారుతి మార్కెట్ లోకి తేవడం నిజంగా ఆసక్తికర విషయం అని చెప్పాలి.
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
International Yoga Day 2026: ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక…
Puranapanda Srinivas: హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా…
This website uses cookies.