Tea: ప్రస్తుత కాలంలో వంటలు తయారు చేయాలి అంటే చాలామంది అల్యూమినియం స్టీల్ నాన్ స్టిక్ వంటి పాత్రలను ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ పూర్వకాలంలో అలా కాదు వంట చేయాలి అంటే ఎక్కువగా రాగి ఇనుము ఇత్తడి మట్టి పాత్రలు ఉపయోగించేవారు. అప్పట్లో ఇవి మాత్రమే మనకు దొరికేవి కనుక వీటిలోనే తయారు చేసుకుని తినేవారు.
ఇలా పూర్వకాలంలో రాగి, ఇత్తడి, మట్టి పాత్రలలో ఆహార పదార్థాలను చేసుకుని తినటం వల్ల ఆహార పదార్థాలకు ఎంతో రుచి రావడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండేవి అందుకే అప్పటి పెద్ద వాళ్ళు ఇప్పటికే చాలా ఆరోగ్యంగా ఉన్నారు కానీ ప్రస్తుత కాలంలో మనం తినే ఆహారంలో ఏ విధమైనటువంటి పోషక విలువలు లేకుండా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.
ఇక ప్రతిరోజు చాలామంది ఇష్టపడే వాటిలో చాయ్ ఒకటి. ఇలాంటి తాగనిదే చాలామందికి రోజు గొడవదు అయితే టీ తాగేవారు ఇత్తడి పాత్రలలో కనుక టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇత్తడిలో టీ తయారుచేసుకుని తాగటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఇత్తడి పాత్రలు అనేవి మెలనిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీనిలో నీరు,పాలు, టీ తీసుకోవడం వలన కూడా ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాక హానికరమైన యూవీ కిరణాల నుండి కూడా మన శరీరాన్ని రక్షిస్తుంది. ఇత్తడిలో ఉన్నటువంటి జింక్ రక్తాన్ని పెంచేందుకు కూడా ఎంతో సహాయం చేస్తుంది. అంతేకాక రక్తాన్ని కూడా ఎంతగానో శుద్ధి చేస్తుంది. దీంతో పాటుగా ఇత్తడి పాత్రలో ఆహారాన్ని వండుకొని తీసుకోవటం వలన శ్వాసకోశ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఇలా ఇత్తడి పాత్రలలో ఆహార పదార్థాలు ఇన్ని ప్రయోజనాలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
AP POLITICS: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితేనే అసలు…
Film Updates: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం యుద్ధం జరగడం మామూలే. కానీ ఈ వారం రాబోతున్న రెండు…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి…
Film Updates: టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని, ప్రస్తుతం తన…
Cinema News: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను…
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తి పారవశ్యం చాటుకున్నారు.…
This website uses cookies.