Pregnant women: గర్భంతో ఉన్నటువంటి మహిళలు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏ పదార్థాలు అయితే తీసుకుంటారో వారి పిల్లలకు కూడా అదే పోషక విలువలు అందుతాయి. కనుక ఆహార విషయంలో మాత్రం గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకొని ఆహార పదార్థాలు పిల్లల ఎదుగుదలపై అలాగే వారీ ఆరోగ్యపై కూడా ప్రభావాన్ని చూపుతాయి.
ఈ క్రమంలోనే గర్భంతో ఉన్నటువంటి మహిళలు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలకు గుండె సమస్యలు రావని మోనాష్ యూనివర్సిటీ అధ్యయనం ద్వారా వెల్లడించారు. గర్భంతో ఉన్నటువంటి మహిళలు ఎక్కువగా వారి ఆహార పదార్థంలో పీచు పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలి. పీచు పదార్థాలు గుండె సమస్యలను తగ్గిస్తున్నట్లు పలు పరిశోధనలలో వెల్లడైంది.
పీచు పదార్థాలతో పాటు పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాల్లోని పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తల్లికే కాకుండా పిల్లల గుండె ఆరోగ్యాన్నీ నిర్ణయిస్తున్నట్టు తేలటం గమనార్హం.ఇవి తల్లి రక్తం ద్వారా ప్రయాణించి, మాయను దాటుకొని పిండంలో జన్యు పనితీరును ప్రభావితం చేస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందుకే తల్లి గర్భంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ పోషక విలువలు అలాగే పీచు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం.
AP POLITICS: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితేనే అసలు…
Film Updates: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం యుద్ధం జరగడం మామూలే. కానీ ఈ వారం రాబోతున్న రెండు…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి…
Film Updates: టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని, ప్రస్తుతం తన…
Cinema News: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను…
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తి పారవశ్యం చాటుకున్నారు.…
This website uses cookies.