Pregnant women: గర్భంతో ఉన్నటువంటి మహిళలు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏ పదార్థాలు అయితే తీసుకుంటారో వారి పిల్లలకు కూడా అదే పోషక విలువలు అందుతాయి. కనుక ఆహార విషయంలో మాత్రం గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకొని ఆహార పదార్థాలు పిల్లల ఎదుగుదలపై అలాగే వారీ ఆరోగ్యపై కూడా ప్రభావాన్ని చూపుతాయి.
ఈ క్రమంలోనే గర్భంతో ఉన్నటువంటి మహిళలు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలకు గుండె సమస్యలు రావని మోనాష్ యూనివర్సిటీ అధ్యయనం ద్వారా వెల్లడించారు. గర్భంతో ఉన్నటువంటి మహిళలు ఎక్కువగా వారి ఆహార పదార్థంలో పీచు పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలి. పీచు పదార్థాలు గుండె సమస్యలను తగ్గిస్తున్నట్లు పలు పరిశోధనలలో వెల్లడైంది.
పీచు పదార్థాలతో పాటు పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాల్లోని పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తల్లికే కాకుండా పిల్లల గుండె ఆరోగ్యాన్నీ నిర్ణయిస్తున్నట్టు తేలటం గమనార్హం.ఇవి తల్లి రక్తం ద్వారా ప్రయాణించి, మాయను దాటుకొని పిండంలో జన్యు పనితీరును ప్రభావితం చేస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందుకే తల్లి గర్భంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ పోషక విలువలు అలాగే పీచు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.