Pregnant women: గర్భంతో ఉన్నటువంటి మహిళలు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏ పదార్థాలు అయితే తీసుకుంటారో వారి పిల్లలకు కూడా అదే పోషక విలువలు అందుతాయి. కనుక ఆహార విషయంలో మాత్రం గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకొని ఆహార పదార్థాలు పిల్లల ఎదుగుదలపై అలాగే వారీ ఆరోగ్యపై కూడా ప్రభావాన్ని చూపుతాయి.
ఈ క్రమంలోనే గర్భంతో ఉన్నటువంటి మహిళలు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలకు గుండె సమస్యలు రావని మోనాష్ యూనివర్సిటీ అధ్యయనం ద్వారా వెల్లడించారు. గర్భంతో ఉన్నటువంటి మహిళలు ఎక్కువగా వారి ఆహార పదార్థంలో పీచు పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలి. పీచు పదార్థాలు గుండె సమస్యలను తగ్గిస్తున్నట్లు పలు పరిశోధనలలో వెల్లడైంది.
పీచు పదార్థాలతో పాటు పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాల్లోని పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తల్లికే కాకుండా పిల్లల గుండె ఆరోగ్యాన్నీ నిర్ణయిస్తున్నట్టు తేలటం గమనార్హం.ఇవి తల్లి రక్తం ద్వారా ప్రయాణించి, మాయను దాటుకొని పిండంలో జన్యు పనితీరును ప్రభావితం చేస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందుకే తల్లి గర్భంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ పోషక విలువలు అలాగే పీచు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.