News: చనిపోయిన తర్వాత మనిషి శరీరాన్ని అక్కడ ఎరువుగా వాడేస్తున్నారని తెలుసా?

News: దేశ ముదురు సినిమాలో ఈ శరీరంలో ఏముంది అంటే మాట్టే కదా అని హీరోయిన్ ఓ డైలాగ్ చెబుతుంది. అది ముమ్మాటికి నిజమే. మానవ శరీర నిర్మాణం మట్టి, నీటితోనే మేగ్జిమమ్ నిండి ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక గ్రంధాలలో కూడా ఆత్మకి చావులేదు. మరణం దేహానికి మాత్రమే అని మహర్షులు చెప్పారు. నిజమే మరణం ఈ దేహానికి మాత్రమే. మరణం తర్వాత ఈ శరీరంలో జీవాత్మ ఏం అవుతుందనేది ఎప్పటికి రహస్యమే. ఒక్కో మతం ఒక్కో విధంగా ఈ మానవ శరీరాన్ని వీడిన ప్రాణం ఉనికి గురించి చెప్పారు. ఎవరు ఎన్ని పంచభూతాల నిర్మితమైన ఈ శరీరాన్ని ఆత్మ వీడిన తర్వాత తిరిగి మట్టిలో కలిసిపోవాల్సిందే కొన్ని మతాచారాలలో ఈ శరీరాన్ని దహనం చేస్తారు.

కొన్ని మతాలలో భూమిలోనే పాతేస్తారు. తరువాత శరీరంలో మట్టిలో పూర్తిగా కలిసిపోతుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత చూసుకుంటే తవ్విన చోట మనిషి ఎముకలు, అస్థిపంజరాలు మాత్రమే కనిపిస్తాయి. ఇతర శరీర అవయవాలు అన్ని మట్టిలో కలిసిపోతాయి. మట్టిలో కలిసిపోయిన శరీరం సేంద్రీయ వ్యర్ధాలుగా మారిపోతుంది. అయితే ఈ సేంద్రీయ వ్యర్ధాలని ఎందుకు మళ్ళీ ఉపయోగించకూడదు అనే ప్రశ్న శాస్త్రవేత్తలకి వచ్చింది. జనాభా పెరిగిపోతున్న నేపధ్యంలో చనిపోతున్న మనుషులని పాతడానికి కూడా భూమిపై స్థలం ఉండటం లేదు.

ఈ నేపధ్యంలో మానవ శరీరంతో సేంద్రీయ ఎరువులని తయారు చేసే పద్ధతిని మొదలు పెట్టారు. దీనిని న్యూయార్క్ లో లీగల్ అప్రూవల్ కూడా పొందారు. మానవ మృతదేహంతో మొక్కలకి ఉపయోగపడే సేంద్రీయ ఎరువులని తయారు చేసే ప్రక్రియకి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. హ్యూమన్ కంపోస్టింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో మృతదేహాలని ఖననం చేయకుండా వాటిని ఎకో ఫ్రెండ్లీ విధానంలో సేంద్రీయ వ్యర్ధాలుగా మార్చి మొక్కలకి కంపోస్టింగ్ గా ఉపయోగిస్తున్నారు. ఈ వ్యర్ధాలు నేలని సారవంతంగా పెంచడంలో ఉపయోగపడు తున్నాయని, రసాయిన ఎరువులకి ప్రత్యామ్నాయంగా ఈ హ్యూమన్ కంపోస్టింగ్ ఏదో నాణ్యమైన ఎరువుగా మారుతుందని ప్రయోగాత్మకంగా ప్రూవ్ చేశారు.

బయోడిగ్రేడబుల్ పదార్ధాలని ఉపయోగించి వాటిని మృతదేహంపై వేసి 30 రోజుల పాటు భద్రపరుస్తారు. పచ్చిగడ్డి, ఎండుగడ్డి సహాయంతో శరీరంలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది శరీరం పూర్తిగా విచ్చిన్నం అవుతుంది. దానిని అత్యధిక టెంపరేచర్ వద్ద వేడి చేస్తారు. దీని ద్వారా అందులో ఉన్న హానికారక సూక్ష్మజీవులు చనిపోతాయి. ఇలా తయారైన వ్యర్ధాలని మొక్కలకి కంపోస్ట్ ఎరువుగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఎరువులని పంటపొలాలకి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకవేళ ఇంట్లో మొక్కలకి ఉపయోగించాలని అనుకుంటే మాత్రం సిమ్మెట్రీ కార్పొరేషన్‌ అనుమతులు తీసుకోవాలి. ఇక ఈ హ్యూమన్ కంపోస్టింగ్ ఎరువుపై చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని దానిని తయారు చేస్తున్న సంస్థలు తెలుపుతున్నాయి. భవిష్యత్తులో మానవ శరీరాన్ని ఇలా ఉపయోగం లేకుండా ఖననం చేయకుండా హ్యూమన్ కంపోస్టింగ్ గా మార్చే ప్రక్రియ అన్ని దేశాలకి విస్తరించే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

1 week ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

3 weeks ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

1 month ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago