Categories: NewsPolitics

Kodali Nani: వైసీపీ సరికొత్త డైవర్షన్.. ఎన్టీఆర్ మరణంపై కొడాలి నాని కామెంట్స్

Kodali Nani: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువగా చేస్తుంది అనే సంగతి అందరికి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్ర మొదలు కాగానే ఏపీ రాజధానిగా విశాఖపట్నం అంటూ ఏకంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసి  ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారు. అయితే అది వర్క్ కాలేదు. కాని కొంత వరకు టీడీపీ నాయకులు జగన్ కామెంట్స్ పై విమర్శలు చేశారు. ఇక సుప్రీం కోర్టులో ఉన్న అంశంపై జగన్ ఎలా మాట్లాడుతాడు అంటూ నిలదీశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వైపు వైఎస్ వివేకానంద హత్యా కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కి ఈ కేసు చుట్టుకునేలా కనిపిస్తుంది. సీబీఐ అధికారులు జగన్ రెడ్డి ఓఎస్డీ వరకు వచ్చేశారు.

మరో వైపు నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురుతిరిగి వైసీపీ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఈ రెండు విషయాల చుట్టూ ప్రజల ఆలోచనలు తిరుగుతున్నాయి. అయితే ఈ అంశాలు వైసీపీపై వ్యతిరేకత పెంచే ప్రమాదం ఉందని గ్రహించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు మరో కొత్త డైవర్షన్ ని తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా ఎమ్మెల్యే కొడాలి నాని మీడియా ముందుకి వచ్చి సీనియర్ ఎన్టీఆర్ మరణంపై అనుమానం ఉందని కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ చేయాలని కోరుతున్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపాడు. అలాగే నందమూరి ఫ్యామిలీ రాజకీయాలలోకి వద్దామని అనుకున్న సమయంలోనే  వారి కుటుంబంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని అన్నారు.

kodali-nani-sensational-comments-on-ntr-death

హరికృష్ణ తెలుగుదేశానికి వ్యతిరేకంగా మారుతున్నారని పరిణామాలు కనిపించిన సమయంలో అయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని అన్నారు. అలాగే నందమూరి తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్న టైంలో కుప్పంలో ఆయనకి గుండెపోటు రావడం హాస్పిటల్ లో పడటం జరిగిందని అన్నారు. వీటి వెనుక కుట్ర కోణం ఉందని కామెంట్స్ చేశారు. వీటి వెనుక అనుమానాలు ఉన్నాయని, సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కొడాలి నాని కేవలం వైసీపీ వ్యూహంలో భాగంగానే ప్రజల ఆలోచనని డైవర్ట్ చేయడానికి ఈ వ్యాఖ్యలు చేసి తెరపైకి కొత్త అంశాన్ని తీసుకొచ్చారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఎన్టీఆర్, నందమూరి కుటుంబం అభిమానిగా చెప్పుకునే కొడాలి నానితో ఈ రకమైన వ్యాఖ్యలు చేయించడం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టి, ప్రజల దృష్టి పూర్తిగా వివేకానంద హత్యకేసు విచారణ, అలాగే కోటంరెడ్డి ఇష్యూ నుంచి డైవర్ట్ అవుతుందని ఇలా ప్లాన్ చేసినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Varalakshmi

Recent Posts

Mangoes weight Loss: మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారా? అసలు విషయం ఏంటంటే?

Mangoes weight Loss: వేసవికాలం వచ్చింది అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పండ్లు మామిడి పండ్లు. మామిడి పండ్ల…

7 minutes ago

TDP PARTY: టీడీపీకి రాజ్యసభ గండం.. లోకేష్ ఎంట్రీతో సీన్ మారుతుందా?

TDP PARTY: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సైరన్ మోగడంతో పచ్చ చొక్కాల లీడర్లలో కొత్త జోష్ రావాల్సింది పోయి, పాత…

30 minutes ago

Telangana: జనసేన సభకు నో పర్మిషన్.. రూటు మార్చిన‌ పవన్..!

Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…

2 hours ago

Andhra Pradesh: రాపాక, ఆమంచి.. ఈ ఇద్ద‌రు ఏ పార్టీలో ఉన్నార‌బ్బా..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…

2 hours ago

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

7 hours ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

18 hours ago

This website uses cookies.