Categories: NewsPolitics

Kodali Nani: వైసీపీ సరికొత్త డైవర్షన్.. ఎన్టీఆర్ మరణంపై కొడాలి నాని కామెంట్స్

Kodali Nani: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువగా చేస్తుంది అనే సంగతి అందరికి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్ర మొదలు కాగానే ఏపీ రాజధానిగా విశాఖపట్నం అంటూ ఏకంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసి  ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారు. అయితే అది వర్క్ కాలేదు. కాని కొంత వరకు టీడీపీ నాయకులు జగన్ కామెంట్స్ పై విమర్శలు చేశారు. ఇక సుప్రీం కోర్టులో ఉన్న అంశంపై జగన్ ఎలా మాట్లాడుతాడు అంటూ నిలదీశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వైపు వైఎస్ వివేకానంద హత్యా కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కి ఈ కేసు చుట్టుకునేలా కనిపిస్తుంది. సీబీఐ అధికారులు జగన్ రెడ్డి ఓఎస్డీ వరకు వచ్చేశారు.

మరో వైపు నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురుతిరిగి వైసీపీ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఈ రెండు విషయాల చుట్టూ ప్రజల ఆలోచనలు తిరుగుతున్నాయి. అయితే ఈ అంశాలు వైసీపీపై వ్యతిరేకత పెంచే ప్రమాదం ఉందని గ్రహించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు మరో కొత్త డైవర్షన్ ని తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా ఎమ్మెల్యే కొడాలి నాని మీడియా ముందుకి వచ్చి సీనియర్ ఎన్టీఆర్ మరణంపై అనుమానం ఉందని కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ చేయాలని కోరుతున్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపాడు. అలాగే నందమూరి ఫ్యామిలీ రాజకీయాలలోకి వద్దామని అనుకున్న సమయంలోనే  వారి కుటుంబంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని అన్నారు.

kodali-nani-sensational-comments-on-ntr-death

హరికృష్ణ తెలుగుదేశానికి వ్యతిరేకంగా మారుతున్నారని పరిణామాలు కనిపించిన సమయంలో అయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని అన్నారు. అలాగే నందమూరి తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్న టైంలో కుప్పంలో ఆయనకి గుండెపోటు రావడం హాస్పిటల్ లో పడటం జరిగిందని అన్నారు. వీటి వెనుక కుట్ర కోణం ఉందని కామెంట్స్ చేశారు. వీటి వెనుక అనుమానాలు ఉన్నాయని, సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కొడాలి నాని కేవలం వైసీపీ వ్యూహంలో భాగంగానే ప్రజల ఆలోచనని డైవర్ట్ చేయడానికి ఈ వ్యాఖ్యలు చేసి తెరపైకి కొత్త అంశాన్ని తీసుకొచ్చారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఎన్టీఆర్, నందమూరి కుటుంబం అభిమానిగా చెప్పుకునే కొడాలి నానితో ఈ రకమైన వ్యాఖ్యలు చేయించడం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టి, ప్రజల దృష్టి పూర్తిగా వివేకానంద హత్యకేసు విచారణ, అలాగే కోటంరెడ్డి ఇష్యూ నుంచి డైవర్ట్ అవుతుందని ఇలా ప్లాన్ చేసినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Varalakshmi

Recent Posts

Andhra Pradesh: రాపాక, ఆమంచి.. ఈ ఇద్ద‌రు ఏ పార్టీలో ఉన్నార‌బ్బా..?

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…

14 minutes ago

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

5 hours ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

16 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

22 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

1 day ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

3 days ago

This website uses cookies.