Categories: NewsPolitics

Kodali Nani: వైసీపీ సరికొత్త డైవర్షన్.. ఎన్టీఆర్ మరణంపై కొడాలి నాని కామెంట్స్

Kodali Nani: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువగా చేస్తుంది అనే సంగతి అందరికి తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్ర మొదలు కాగానే ఏపీ రాజధానిగా విశాఖపట్నం అంటూ ఏకంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసి  ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేశారు. అయితే అది వర్క్ కాలేదు. కాని కొంత వరకు టీడీపీ నాయకులు జగన్ కామెంట్స్ పై విమర్శలు చేశారు. ఇక సుప్రీం కోర్టులో ఉన్న అంశంపై జగన్ ఎలా మాట్లాడుతాడు అంటూ నిలదీశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వైపు వైఎస్ వివేకానంద హత్యా కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కి ఈ కేసు చుట్టుకునేలా కనిపిస్తుంది. సీబీఐ అధికారులు జగన్ రెడ్డి ఓఎస్డీ వరకు వచ్చేశారు.

మరో వైపు నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురుతిరిగి వైసీపీ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఈ రెండు విషయాల చుట్టూ ప్రజల ఆలోచనలు తిరుగుతున్నాయి. అయితే ఈ అంశాలు వైసీపీపై వ్యతిరేకత పెంచే ప్రమాదం ఉందని గ్రహించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు మరో కొత్త డైవర్షన్ ని తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా ఎమ్మెల్యే కొడాలి నాని మీడియా ముందుకి వచ్చి సీనియర్ ఎన్టీఆర్ మరణంపై అనుమానం ఉందని కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ చేయాలని కోరుతున్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని తెలిపాడు. అలాగే నందమూరి ఫ్యామిలీ రాజకీయాలలోకి వద్దామని అనుకున్న సమయంలోనే  వారి కుటుంబంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని అన్నారు.

kodali-nani-sensational-comments-on-ntr-death

హరికృష్ణ తెలుగుదేశానికి వ్యతిరేకంగా మారుతున్నారని పరిణామాలు కనిపించిన సమయంలో అయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని అన్నారు. అలాగే నందమూరి తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్న టైంలో కుప్పంలో ఆయనకి గుండెపోటు రావడం హాస్పిటల్ లో పడటం జరిగిందని అన్నారు. వీటి వెనుక కుట్ర కోణం ఉందని కామెంట్స్ చేశారు. వీటి వెనుక అనుమానాలు ఉన్నాయని, సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కొడాలి నాని కేవలం వైసీపీ వ్యూహంలో భాగంగానే ప్రజల ఆలోచనని డైవర్ట్ చేయడానికి ఈ వ్యాఖ్యలు చేసి తెరపైకి కొత్త అంశాన్ని తీసుకొచ్చారనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఎన్టీఆర్, నందమూరి కుటుంబం అభిమానిగా చెప్పుకునే కొడాలి నానితో ఈ రకమైన వ్యాఖ్యలు చేయించడం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టి, ప్రజల దృష్టి పూర్తిగా వివేకానంద హత్యకేసు విచారణ, అలాగే కోటంరెడ్డి ఇష్యూ నుంచి డైవర్ట్ అవుతుందని ఇలా ప్లాన్ చేసినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

Varalakshmi

Recent Posts

Bandi Bhagirath: బండి సంజయ్ కుమారుడి కేసులో ట్విస్ట్‌.. ఊరంతా అవే పోస్టర్లు!

Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…

13 hours ago

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ..!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…

15 hours ago

Petrol Price News: ఇంత దారుణంగా పెట్రోల్ ధరలు పెరగనున్నాయా?

Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…

1 day ago

CM Revanth Reddy: కేంద్రంతో క‌లుస్తాం.. కానీ, అందుకు మాత్రం కాదు!

CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

1 day ago

Narendra Modi: గోల్డ్‌ కొనకండి.. మోదీ పిలుపు వెనుక అర్థ‌మేంటి..?

Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…

2 days ago

Roja Selvamani: USలో తొలి ఇండియ‌న్‌గా అన్షు క్రేజీ రికార్డ్‌.. ఏడ్చేసిన రోజా!

Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…

2 days ago

This website uses cookies.