Kiara Advani : వైలెంటైన్ డే రోజు తమ హల్దీ పిక్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేసి తమ ప్రేమను వ్యక్తం చేశారు బాలీవుడ్ కొత్త జంట కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్ర.పసుపు దుస్తులలో అత్యంత సరదాగా వధువుగా కియారా వరుడుగా సిద్దార్ధ్లు క్రేజీ పోజులు ఇచ్చి ఫోటో షూట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తమ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ యంగ్ కపుల్ తమ హల్దీ పిక్స్ ను పోస్ట్ చేశారు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో కొత్త జంట పసుపు రంగు సాంప్రదాయ దుస్తులలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.
కియారా అద్వానీ , సిద్ధార్థ్ మల్హోత్రాల హల్దీ వేడుక ఫిబ్రవరి 5 న జరిగింది. అనంతరం ఫిబ్రవరి 7న రాజస్థాన్లోని జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో నటీనటులు వివాహం చేసుకున్నారు. ఈ జంట వేదిక వద్ద ఒకరినొకరు పట్టుకున్న పిక్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. వీరిద్దరూ ప్రముఖ ఫ్యాష్ డిజైనర్ బాలీవుడ్ ఫేవరేట్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించారు. కియారా పసుపు రంగు దుపట్టాతో తెల్లటి లెహంగా ధరించగా, సిద్ధార్థ్ పసుపు రంగు కుర్తాతో ప్రింటెడ్ శాలువను భుజాన వేసుకున్నాడు.
ఇన్స్టాగ్రామ్లో, ఈ జంట తమ హల్దీ పిక్స్ ను పోస్ట్ చేసి “ప్యార్ కా రంగ్ చద్దా హే ” అని క్యాప్షన్ను జోడించారు. అదే విధంగా రెడ్ హార్ట్ ఎమోజీని కూడా జోడించారు. ఈ పిక్స్ చూసిన అభిమానులు రెడ్ హార్ట్ ఏమోజీలను పోస్ట్ చేసి వారి వైవాహిక జీవితానికి మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
కియారా అద్వానీ రాజస్థాన్ గోల్డెన్ అవర్లో రంగులు అద్దిన దుపట్టాతో ఉత్కంఠభరితమైన తెల్లని లెహంగాలో ప్రకాశవంతమైన వెలుగులో అత్యద్భుతంగా కనిపించింది.ఈ అవుట్ ఫిట్కు తగ్గట్లుగా ప్రియాంక ధరించిన రెండు నెక్లెస్లు దానికి సెట్ గా ఇయర్ రింగ్స్ ను అలంకరించుకుని టాక్ ఆఫ్ది టౌన్ గా మారింది. కియారా అద్వానీ మినిమల్ మేకప్తో, బ్రైడల్ గ్లోతో అత్యద్భుతంగా కనిపించింది.
ఫిబ్రవరి 7న అత్యంత వైభంగా కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యలో వివాహం చేసుకున్న తర్వాత ఈ నటీనటులు వారం రోజుల పాటు సంబరాలు చేసుకున్నారు. ఫిబ్రవరి 9న కుటుంబ సభ్యులు , సన్నిహితుల కోసం ఢిల్లీలో రిసెప్షన్ని నిర్వహించి, ఫిబ్రవరి 11న ముంబైకి తిరిగి వచ్చారు.ఫిబ్రవరి 12న, ముంబైలోని సెయింట్ రెగిస్ హోటల్లో రిసెప్షన్ను నిర్వహించారు. అక్కడ బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, సెలబ్రిటీలు హాజరయ్యారు.
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
International Yoga Day 2026: ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక…
Puranapanda Srinivas: హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా…
This website uses cookies.