Categories: LatestNewsTips

KCR Breakfast : బడి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ గా ఇడ్లీ సాంబార్‌, ఉప్మా, పూరి..సీఎం కేసీర్ ఐడియా సూపర్

KCR Breakfast : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నయా పథకాన్ని శ్రీకారం చుట్టారు. సర్కారి బడుల్లో చదువుకునే పిల్లలకు దసరా గిఫ్ట్ గా ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ అనే సరికొత్త స్కీం ను ఇవాళ్టి నుంచి అమలు చేయబోతున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితాఇంద్రారెడ్డి, ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్‌రావు ఈ కొత్త పథకాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్‌ఎస్‌లో షురూ చేశారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని వెస్ట్‌ మారేడుపల్లి గవర్నమెంట్ స్కూల్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని స్కూల్స్ లో మినిస్టర్లు , ఎమ్మెల్యేలు, ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు.

సీఎం బ్రేక్‌ఫాస్ట్‌’ అనే సరికొత్త స్కీం లో భాగంగా ప్రతీ స్కూల్‌లో ఉదయం 8 గంటల నుంచే బ్రేక్ ఫాస్ట్ విద్యార్థులకు అబదిస్తారు. ఇలా వారంలో ఆరో రోజుల పాటు పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ పెడతారు .

kcr-breakfast-telangana-cm-kcr-launched-breakfast-scheme-at-govt-schools

మరి బ్రేక్ ఫాస్ట్ మెనూ ఎలా తయారు చేశారో చూద్దాం..

సోమవారం: ఇడ్లీ సాంబార్‌/ గోధుమ రవ్వ ఉప్మా

మంగళవారం: పూరి/ టమాటా బాత్‌,

బుధవారం: ఉప్మా,సాంబార్‌/ కిచిడీ

గురువారం: మిల్లెట్‌ ఇడ్లీ / పొంగల్‌

శుక్రవారం: ఉగ్గాని/ పోహా/మిల్లెట్‌ ఇడ్లీ,కిచిడీ, చట్నీ

శనివారం: పొంగల్‌/వెజ్‌ పలావ్‌

సర్కారి బడుల్లో చదువుతున్న పిల్లలకు ప్రతీ రోజూ పోషకాలతో కూడిన ఆహారం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసున్నారు. ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ కి 45 నిమిషాల టైం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లో ప్రతీ స్కూల్ ఉదయం 8.45 గంటల నుంచి మొదలై.. మధ్యాహ్నం 3.45 గంటలకు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో స్కూల్ మొదలయ్యే 45 నిమిషాలు ముందుగా విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగు పరచలానే కేసీర్ సర్కార్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అంతే కాదు ఈ బ్రేక్ ఫాస్ట్ పథకం అమలులోకి వస్తే.. విద్యార్థులు డుమ్మా కొట్టకుండా స్కూల్ కి వస్తారని, డ్రాపౌట్‌లు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

kcr-breakfast-telangana-cm-kcr-launched-breakfast-scheme-at-govt-schools

సీఎం ‘అల్పాహారం’ పథకాన్ని రాష్ట్రంలోని 27,147 స్కూల్స్ లో అమలు చేస్తున్నారు.అంటే 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. అందుకే విద్యార్థులు స్కూళ్ల ప్రారంభానికి అరగంట ముందే బడులకు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని స్కూల్స్ లో అక్షయపాత్ర సంస్థ అల్పాహారాన్ని అందజేయనుంది. మిగతా జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికులు అందజేస్తారు.

Sri Aruna Sri

Recent Posts

Prabhas-Spirit: సందీప్ రెడ్డి వంగ రేంజ్‌ ఇది..

Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…

22 hours ago

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

7 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

2 weeks ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

2 weeks ago

This website uses cookies.