kapu-community-unite-for-pawan-kalyan
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో తనదైన పంథాలో ముందుకి వెళ్తున్నాడు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా బలమైన స్థానాలలో గెలవాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఆ దిశగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. రాబోయే ఎన్నికలలో గెలిస్తే ప్రజా ప్రస్థానంలో సుదీర్ఘంగా రాజకీయాలు చేయగలమని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆ దిశగా తన అడుగులు వేస్తున్నారు. వైసీపీని గద్దె దించడంతో పాటు అధికారంలో భాగస్వామ్యం కావాలని భావిస్తున్నారు. దానికోసం అవసరం అయితే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ పొత్తులతో కచ్చితంగా అధికారంలోకి రావొచ్చని భావిస్తున్నారు.
అయితే టీడీపీని జనసేన ఎక్కువ స్థానాలు డిమాండ్ చేయడంతో పాటు ముఖ్యమంత్రి అధికారంలో భాగస్వామ్యం కూడా కోరుకుంటున్నారు. దానికి టీడీపీ సిద్ధంగా లేదు. అయితే ఓ వైపు టీడీపీతో పొత్తు రాజకీయాలు నడుపుతూనే గ్రౌండ్ లెవల్ లో క్యాడర్ ని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సభ్యుత్వ నమోదు కార్యక్రమం ద్వారా జనసేన బలం గ్రామీణ స్థాయిలో ఎంత ఉంది అనేది ఒక అంచనాకి రావొచ్చు. ఈ రెండు జరిగిన తర్వాత వారాహియాత్రకి సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సీనియర్ నేత హరిరామజోగయ్య కాపు సామాజికవర్గాన్ని సమీకృతం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ద్వారా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అవకాశం కాపులకి వస్తుందని, దీనికి ఈ సారి బలంగా ఉపయోగించుకోవాలని కాపు నాయకులకి పిలుపునిస్తున్నారు. అయితే వైసీపీలో ఉన్న కాపులు మాత్రం ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకుండా ఆపాలని ప్యాకేజీకి అమ్ముడుపోయాడు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ అంశాన్ని పట్టుకొని వైసీపీని ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.
దాని ద్వారా కాపులలో ఐక్యత పెంచి జనసేనకి బలమైన ఓటుబ్యాంకుగా మార్చవచ్చని భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే ఉదయగోదావరి జిల్లాలలో కాపు సంఘాల సమావేశాలు రెగ్యులర్ గా జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ కాపు ఓటుబ్యాంకు, రాజ్యాధికారం దిశగా పవన్ కళ్యాణ్ కి వారు ఎంత వరకు మద్దతుగా నిలబడతారు అనేది చూడాలి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.