లెజెండరీ దర్శకుడు కె విశ్వనాథ్ ఈ నెల ఆరంభంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎన్నో అద్భుతమైన కళాఖండాలు టాలీవుడ్ కి అందించిన దర్శక ధీరుడు కె విశ్వనాథ్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట కె విశ్వనాథ్ సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే తాజాగా కె విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఆమె ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తుంది. భర్త మరణంతో కొద్ది రోజులుగా దుఃఖంతో ఉన్నా ఆమె మానసికంగా కృంగిపోయినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలోనే ఆమె మరణించినట్లు సమాచారం. భర్త మరణించి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఆమె మరణించడం ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. భర్త మృతిని తట్టుకోలేకనే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కె విశ్వనాథ్ టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుకుగా మన్ననలు అందుకుంటున్నారు. ఇక భవిష్యత్తులో అతన్ని రిప్లేస్ చేసే దర్శకుడు రాడని సినీ ప్రముఖులు సైతం చెబుతున్నారు. అలాంటి లెజెండరీ దర్శకుడిని కోల్పోవడం కచ్చితంగా లోటని అంటున్నారు.
Chicken: సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని మన పెద్ద వాళ్ళు చెబుతుంటారు. జ్వరం వచ్చిన సమయంలో చికెన్ తినడం…
Tirumala Darshan Tickets: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్నటువంటి భక్తులకు టిటిడి శుభవార్తను తెలిపింది.…
Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…
Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
This website uses cookies.