లెజెండరీ దర్శకుడు కె విశ్వనాథ్ ఈ నెల ఆరంభంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎన్నో అద్భుతమైన కళాఖండాలు టాలీవుడ్ కి అందించిన దర్శక ధీరుడు కె విశ్వనాథ్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట కె విశ్వనాథ్ సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే తాజాగా కె విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఆమె ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తుంది. భర్త మరణంతో కొద్ది రోజులుగా దుఃఖంతో ఉన్నా ఆమె మానసికంగా కృంగిపోయినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలోనే ఆమె మరణించినట్లు సమాచారం. భర్త మరణించి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఆమె మరణించడం ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. భర్త మృతిని తట్టుకోలేకనే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కె విశ్వనాథ్ టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుకుగా మన్ననలు అందుకుంటున్నారు. ఇక భవిష్యత్తులో అతన్ని రిప్లేస్ చేసే దర్శకుడు రాడని సినీ ప్రముఖులు సైతం చెబుతున్నారు. అలాంటి లెజెండరీ దర్శకుడిని కోల్పోవడం కచ్చితంగా లోటని అంటున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.