లెజెండరీ దర్శకుడు కె విశ్వనాథ్ ఈ నెల ఆరంభంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎన్నో అద్భుతమైన కళాఖండాలు టాలీవుడ్ కి అందించిన దర్శక ధీరుడు కె విశ్వనాథ్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఇక ఆయన మరణంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇప్పటికి రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట కె విశ్వనాథ్ సంతాప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే తాజాగా కె విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఆమె ఇంట్లోనే గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తుంది. భర్త మరణంతో కొద్ది రోజులుగా దుఃఖంతో ఉన్నా ఆమె మానసికంగా కృంగిపోయినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలోనే ఆమె మరణించినట్లు సమాచారం. భర్త మరణించి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఆమె మరణించడం ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. భర్త మృతిని తట్టుకోలేకనే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కె విశ్వనాథ్ టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుకుగా మన్ననలు అందుకుంటున్నారు. ఇక భవిష్యత్తులో అతన్ని రిప్లేస్ చేసే దర్శకుడు రాడని సినీ ప్రముఖులు సైతం చెబుతున్నారు. అలాంటి లెజెండరీ దర్శకుడిని కోల్పోవడం కచ్చితంగా లోటని అంటున్నారు.
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.…
This website uses cookies.