Categories: EducationLatestNews

Jio: జియో ల్యాప్ ట్యాప్ లు… అతి తక్కువ ధరల్లో మార్కెట్ లోకి

Jio: జియో ల్యాప్ ట్యాప్ లు… అతి తక్కువ ధరల్లో మార్కెట్ లోకి
దేశీయ టెలికాం, ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ జియో. దేశీయ మార్కెట్ ని జియో ప్రస్తుతం శాసిస్తుంది అని చెప్పాలి. రిలయన్స్ నుంచి జియో సిమ్ లతో మొదటిగా టెలికాం మార్కెట్ లోకి సరికొత్తగా వచ్చి ఉచిత ఆఫర్స్ తో అతి తక్కువ కాలంలో టెలికాం మార్కెట్ పై రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబాని ఆధిపత్యంలోకి వచ్చారు. అన్ని టెలికాం సేవలని దాటిపోయి దేశంలోనే అత్యధికంగా వినియోగించే సేవలుగా జియో మార్కెట్ లో నిలిచింది.

ఇక అక్కడి నుంచి ఎప్పటికప్పుడు తన జియో మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నారు. జియో సిమ్ లతో కలిపి జియో ఫోన్స్ ని అతి తక్కువ ధరల్లో సామాన్యులకి అందుబాటులోకి తీసుకొచ్చాయి. స్మార్ట్ ఫోన్ లో ఉన్న వీడియో, యూట్యూబ్ ఫీచర్స్ ని చిన్న సెల్ లోకి తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఫోన్ లు విపరీతంగా సేల్ అయ్యాయి. ఇక ఇప్పుడు టెలికాం రంగంలో సరికొత్త అధ్యయనంగా భావించే 5జీ సేవలని ఇండియాలో మొట్టమొదటిగా జియో స్టార్ట్ చేస్తుంది.

జియో5జీ సేవలని ప్రధాని మోడీ రెండు రోజుల క్రితం స్టార్ట్ చేశారు. 2023 ఆఖరుకి 5జీ సేవలని దేశ వ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంగా జియో నెట్ వర్క్ పనిచేస్తుందని ముఖేష్ అంబానీ తాజాగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే త్వరలో మార్కెట్ లోకి జియో ల్యాప్ టాప్ లని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ల్యాప్ టాప్ ఖరీదు ప్రస్తుతం 25 వేల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే జియో ల్యాప్ టాప్ లని కేవలం 15 వేల రూపాయిల ధరలలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇందులో జియో ఫీచర్స్ తో, పాటు ల్యాప్ టాప్ కి అవసరమయ్యే ప్రధాన ఫీచర్స్ ని ఇన్ బిల్ట్ గా ఇవ్వబోతున్నారు. ఇక ఈ ల్యాప్ టాప్ కోసం జియో సంస్థ ఇప్పటికే మైక్రో సాఫ్ట్ తో ఆపరేటింగ్ సిస్టమ్ కోసం, ప్రొసెసర్స్ కోసం క్వాల్ కమ్ తో ఒప్పందం చేసుకుంది. ఇక మైక్రో సాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని మార్పులు చేసి జియో ఆపరేటింగ్ సిస్టంని, కొన్ని యాప్స్ ని లిమిటెడ్ గా ఇతర సాఫ్ట్ వేర్స్ ని ల్యాప్ టాప్ లో అందించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ ల్యాప్ టాప్ లని వీలైనంత వేగంగా మార్కెట్ లోకి తీసుకొచ్చి అందరికి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలలో వినిపిస్తుంది. ఇక ల్యాప్ టాప్ లో ఇతర యాప్స్ కావాలన్నా జియో స్టోర్ కి వెళ్లి డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించబోతున్నారు. విద్యార్థులని దృష్టిలో ఉంచుకొని ఈ ల్యాప్ టాప్ లని డెవలప్ చేస్తున్నారని తెలుస్తుంది. భవిష్యత్ లో టెక్, టెలికాం రంగంలో తమ ఆధిపత్యం చూపించుకుని దిశగా ముఖేష్ అంబానీ ఇలా టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెడుతూ దూసుకుపోతున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

12 hours ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

2 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

3 weeks ago

This website uses cookies.