Politics: ఏపీలో అధికార వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అమరావతి శాశన రాజధానిగా, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా నిర్ణయిస్తూ ప్రకటన చేసింది. అయితే దీనిపై ఏపీలో ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. రాజధాని ఒకటే ఉండాలని అది అమరావతి మాత్రమే ఉండాలని అంటున్నాయి. పాలన వికేంద్రీకరణతో ఎలాంటి అభివృద్ధి జరగదని అంటున్నారు. మీకు సాధ్యం అయితే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని అన్ని జిల్లాలకి అభివృద్ధిని, పరిశ్రమలని విస్తరించాలని, దీని ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. అయితే టీడీపీ మాత్రం పరిపాలన అమరావతిలోనే జరగాలని, అలాగే అభివృద్ధి అమరావతి వేదికగా చేసి గొప్ప పట్టణాన్ని తయారు చేయాలని భావిస్తుంది.
ఇక మిగిలిన పార్టీలు అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ప్రతిపక్షాల వాయిస్ ని వినడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. ఎలా అయినా తన పంతాన్ని నెగ్గించుకొని వచ్చే ఏడాది ఉగాది నుంచి విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అయితే దీనికి టీడీపీ అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికలకి కూడా వైసీపీ మూడు రాజధానులు, సంక్షేమ పథకాలు అజెండాగా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మూడు రాజధానులతో ఎలాంటి ప్రయోజనం లేదని ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు. విశాఖ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రోడా మేలుగా అనే కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మూడు రాజధానులతో రాష్ట్రం మొత్తానికి న్యాయం జరగదని అన్నారు.
Sai Pallavi: ఫిదా బ్యూటీ సాయి పల్లవికి బాలీవుడ్లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన మొదటి సినిమా డిజాస్టర్…
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
This website uses cookies.