Politics: ఏపీలో అధికార వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అమరావతి శాశన రాజధానిగా, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా నిర్ణయిస్తూ ప్రకటన చేసింది. అయితే దీనిపై ఏపీలో ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. రాజధాని ఒకటే ఉండాలని అది అమరావతి మాత్రమే ఉండాలని అంటున్నాయి. పాలన వికేంద్రీకరణతో ఎలాంటి అభివృద్ధి జరగదని అంటున్నారు. మీకు సాధ్యం అయితే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని అన్ని జిల్లాలకి అభివృద్ధిని, పరిశ్రమలని విస్తరించాలని, దీని ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. అయితే టీడీపీ మాత్రం పరిపాలన అమరావతిలోనే జరగాలని, అలాగే అభివృద్ధి అమరావతి వేదికగా చేసి గొప్ప పట్టణాన్ని తయారు చేయాలని భావిస్తుంది.
ఇక మిగిలిన పార్టీలు అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ప్రతిపక్షాల వాయిస్ ని వినడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. ఎలా అయినా తన పంతాన్ని నెగ్గించుకొని వచ్చే ఏడాది ఉగాది నుంచి విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అయితే దీనికి టీడీపీ అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికలకి కూడా వైసీపీ మూడు రాజధానులు, సంక్షేమ పథకాలు అజెండాగా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మూడు రాజధానులతో ఎలాంటి ప్రయోజనం లేదని ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు. విశాఖ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రోడా మేలుగా అనే కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మూడు రాజధానులతో రాష్ట్రం మొత్తానికి న్యాయం జరగదని అన్నారు.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.