Politics: ప్రతి జిల్లా ఒక రాజధాని కావాలంటున్న జేడీ లక్ష్మీనారాయణ… అదెలా సాధ్యమంటే?

Politics: ఏపీలో అధికార వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అమరావతి శాశన రాజధానిగా, విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా నిర్ణయిస్తూ ప్రకటన చేసింది. అయితే దీనిపై ఏపీలో ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా వ్యతిరేకిస్తున్నాయి. రాజధాని ఒకటే ఉండాలని అది అమరావతి మాత్రమే ఉండాలని అంటున్నాయి. పాలన వికేంద్రీకరణతో ఎలాంటి అభివృద్ధి జరగదని అంటున్నారు. మీకు సాధ్యం అయితే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని అన్ని జిల్లాలకి అభివృద్ధిని, పరిశ్రమలని విస్తరించాలని, దీని ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. అయితే టీడీపీ మాత్రం పరిపాలన అమరావతిలోనే జరగాలని, అలాగే అభివృద్ధి అమరావతి వేదికగా చేసి గొప్ప పట్టణాన్ని తయారు చేయాలని భావిస్తుంది.

ఇక మిగిలిన పార్టీలు అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ప్రతిపక్షాల వాయిస్ ని వినడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. ఎలా అయినా తన పంతాన్ని నెగ్గించుకొని వచ్చే ఏడాది ఉగాది నుంచి విశాఖ నుంచి పరిపాలన మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అయితే దీనికి టీడీపీ అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎన్నికలకి కూడా వైసీపీ మూడు రాజధానులు, సంక్షేమ పథకాలు అజెండాగా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మూడు రాజధానులతో ఎలాంటి ప్రయోజనం లేదని ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ అంటున్నారు. విశాఖ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రోడా మేలుగా అనే కార్యక్రమానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మూడు రాజధానులతో రాష్ట్రం మొత్తానికి న్యాయం జరగదని అన్నారు.

వైసీపీ తీసుకున్న ఈ విధానంతో అస్సలు ప్రయోజనం లేదని తెలిపారు. మహారాష్ట్ర తరహాలో ప్రతి జిల్లాని ఒక రాజధాని తరహాలో అభివృద్ధి చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకి కల్పించాలని సూచించారు. అక్కడ 13 ఏళ్ళు పని చేసిన అనుభవంతో చెబుతున్నా, అభివృద్ధి అన్ని ప్రాంతాలకి విస్తరించి ఆయా ప్రాంతాల డెమోగ్రాఫికల్ పరిస్థితుల బట్టి రాజధాని తరహాలో ఐడెంటిటీ ఇవ్వడం వలన అన్ని ప్రాంతాలు గొప్ప పట్టణాలుగా మారుతాయని తెలిపారు. ఇదే విధానంలో ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా వెళ్తుందని తెలిపారు. అక్కడికి వచ్చే పరిశ్రమలని జిల్లాల వారీగా ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకి ఉపాధి పెంచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇదే విధానం ఏపీలో కూడా అనుసరిస్తే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అన్ని పార్టీలు ఇదే విధానంలో వెళ్లాలని సూచించారు. పరిపాలన ఒకే చోట నుంచి చేస్తూ అనుబంధంగా శాఖలని ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయాలని దీని వలన ప్రజలకి కూడా ప్రభుత్వంతో అనుసంధానం కావడానికి మార్గం సులభతరం అవుతుందని చెప్పారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Water Bottle: వాటర్ బాటిల్ కొంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Water Bottle: సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుంటాము. అది ఎండాకాలమైనా లేదా వర్షాకాలమైనా…

7 hours ago

Bhaumvati Amavasya 2026: నేడే బౌమా అమావాస్య.. పితృ,కుజ దోష నివారణకు అనుకూలం!

Bhaumvati Amavasya 2026: ప్రతినెల మనకు అమావాస్య వస్తుంది అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను బౌమతి అమావాస్య లేదా…

8 hours ago

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

1 day ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

1 day ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

3 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

5 days ago

This website uses cookies.