Janhvi-Kushi Kapoor : దివంగత నటి అందాల తార శ్రీదేవి తన అందంతో, నటనతో సినీ ఇండస్ట్రీ ని దశాబ్దాలపాటు ఏలింది. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అందరి మనసులను గెలిచింది. ఆమె లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఆమె మరణం అనంతరం ఆమె వారసురాలుగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది.
ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా త్వరలో నటిగా గా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే అందరూ భావించినట్టు బాలీవుడ్ లో కాదు ఈ భామ సౌత్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. మరోవైపు అక్క జాన్వీ కూడా ఎంటీఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించ బోతోంది. దీనితో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ సౌత్ పై దండయాత్ర చేయబోతున్నారు.
జాన్వీ కపూర్ ‘దఢక్’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించింది. దాదాపుగా ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అయితే జాన్వీకి ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు. ఇంకా స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి రాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇస్తుంది. జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించి స్టార్ హీరోయిన్ అవ్వాలని తన ప్రయత్నాలు తాను చేస్తోంది.
ఖుషి కపూర్ సినిమాలు చేయనప్పటికి ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. త్వరలో ‘ది ఆర్చీస్’ అనే మూవీ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. అంతేకాదు తాజాగా ఖుషి కపూర్ కు తమిళ్ ఆఫర్ వచ్చిందట. దీనితో త్వరలో సౌత్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ యాక్టర్ అధర్వ రాబోయే సినిమాలో ఖుషి కపూర్ కనిపించునుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.
దీనితో చెల్లి ఖుషి కపూర్ తమిళ సినిమాతో ఎంట్రీ ఇస్తే, అక్క జాన్వీ తెలుగులో సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. మరి తమిళ్, తెలుగులో శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా నిలబడినట్టే ఈ అక్కాచెల్లెళ్లు అవుతారా లేదో వెయిట్ చేసి చూడాల్సిందే.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.