Categories: LatestNews

Janasena: జనసేన వెర్సస్ వైసీపీ… గర్జన రాజకీయంలో ఉద్రిక్తం

Janasena: ఏపీలో విశాఖ కేంద్రంగా మూడు రాజధానులతో పాలనా వికేంద్రీకరణ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ పార్టీ. గత కొంత కాలంగా అమరావతి టూ అరసవిల్లి రైతుల పాదయాత్ర జరుగుతుంది. దీనికి అడ్డంకులు సృష్టించేందుకు, ఆ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ ఉత్తరాంధ్రలో వికేంద్రీకరణ రాజకీయం తెరపైకి తీసుకొచ్చింది. వెనుకబడిన ఉత్తరాంధ్రకి విశాఖ రాజధానిగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అని విశాఖ గర్జన పేరుతో భారీ ర్యాలీని నిర్వహించారు.

ఒక పవన్ కళ్యాణ్ కూడా విశాఖ గర్జన రోజునే ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకొని జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేనికి గర్జన అంటూ వైసీపీ నేతలని ప్రశ్నిస్తూ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఇక వైసీపీ భారీ ఎత్తున మూడు జిల్లాల నుంచి జన సమీకరణ చేసి విశాఖ గర్జనని పెద్ద ఎత్తున నిర్వహించింది. జోరు వానలో కూడా ర్యాలీ నిర్వహించి గర్జనని విజవంతం చేయడంతో పాటు పనిలోపనిగా పవన్ కళ్యాణ్ మీద వైసీపీ మంత్రులు వ్యక్తిగత విమర్శలతో దాడి చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి రావడంతో అక్కడికి పెద్ద ఎత్తున జనసైనికులు చేరుకున్నారు. అదే సమయంలో వైసీపీ మంత్రులు తిరిగి ప్రయాణంలో ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన సమయంలో జనసైనికులు పెద్ద ఎత్తున వారిని అడ్డుకొని డౌన్ డౌన్ నినాదాలతో మంత్రుల కార్లపై దాడి చేశారు. పోలీసులు జనసైనికులని తప్పించి మంత్రులు అందరిని క్షేమంగా ఎయిర్ పోర్ట్ లోపలికి తీసుకొని వెళ్లిపోయారు. జనసైనికుల దాడితో ఒక్కసారిగా ఎయిర్ పోర్ట్ పరిసరాలలో ఉద్రిక్తత వాతారవరణం ఏర్పడింది.

ఇక వైసీపీ మంత్రులు తక్షణమే మీడియా ముందుకి వచ్చి జనసైనుకుల దాడులని ఖండించారు. అలాగే వైవీ సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఇక జనసేన నాయకులు కూడా వైసీపీ నేతలపై ఎదురుదాడి చేశారు. గర్జన సభ ఫెయిల్యూర్ కావడంతో దానిని డైవర్ట్ చేయడానికి కొత్త నాటకాలకి వారు తెరతీశారని విమర్శించారు. జనసేన కార్యకర్తల ముసుగులో వారే దాడులు చేయించుకున్నారని విమర్శించారు. ఇక తమ మీద తాము దాడులు చేయించుకొని విపక్షాల మీదకినెట్టేయడం వైసీపీకి అలవాటు అయిన విద్య అని నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు.

జనసేన, వైసీపీ మధ్య జరిగిన ఈ దాడుల రాజకీయంపై మీడియా ఫోకస్ అంతా వెళ్ళిపోయింది. గర్జన పేరుతో వికేంద్రీకరణకి మద్దతుగా వైసీపీ చేసిన ర్యాలీ అంతా పక్కకి పోయింది. ఇక రేపు జనవాణి జరగనున్న నేపధ్యంలో వైసీపీ శ్రేణులు కూడా జనసేన దాడులకి ప్రతిగా తిరిగి దాడులు చేసే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో పోలీసులకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ముగిసేంత వరకు పెద్ద పరీక్ష గా ఈ రాజకీయ క్రీడ మారింది. ఏది ఏమైనా విశాఖ వేదికగా వైసీపీ, జనసేన, టీడీపీ రాజకీయం ఇప్పుడు వైసీపీ వెర్సస్ జనసేనగా మారిపోయిందని మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

3 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

1 week ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.