Politics: వ్యూహం తనకి వదిలేయండి అంటున్న జనసేనాని..

Politics: ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రాజకీయ కార్యాచరణతో చురుకుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వైసీపీపై ఎదురుదాడి చేస్తూ, వారి ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతున్నారు. వైసీపీ నేతలు కూడా టీడీపీ కంటే ఎక్కువగా జనసేనాని పైనే ఎదురుదాడి చేస్తున్నారు. ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేసుకొని వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ వైఫ్యలాలని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళడంలో మాత్రం జనసేనాని సఫలీకృతం అవుతున్నారని చెప్పాలి. అలాగే ప్రజల మద్దతు కూడా పెంచుకుంటున్నారు. వరుసగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి చేరువ అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ని వీకెండ్ పొలిటీషియన్ అంటూ వైసీపీ నేతలు కొత్త విమర్శలు తెరపైకి తీసుకొచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ కి నిలకడ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే దీనిపై జనసేనాని రెగ్యులర్ గా స్పందించడం లేదు. కాని ప్రజలలోకి వచ్చినపుడు మాత్రం వైసీపీ నేతలు అందరికి గట్టిగానే ఇస్తున్నారు. వారిపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా సత్తెనపల్లిలో జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర చేసింది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబ సభ్యులకి లక్ష రూపాయిల చెక్కులు పంపిణీ చేశారు. ఇక ఈ సభలో భాగంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వైసీపీపై మరోసారి విమర్శలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పిన మాటకి ఇప్పటికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. అలాగే వైసీపీ లాంటి అరాచక శక్తులని ఓడించాలంటే కచ్చితంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోనని, ప్రజలు కోరుకుంటే మాత్రం కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతానని అన్నారు.

అలాగే వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితిలో కూడా వైసీపీ అధికారంలోకి రాదనీ, ఓడిపోతుందని అన్నారు. అలాగే జనసేన నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పోరాటం చేయాలని, అయితే గెలుపు వ్యూహాల సంగతి నాకు వదిలేయాలని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఓడిపోతామనే భయంతో అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని, భయపెట్టి, బెదిరించి అన్ని రకాలుగా ఆపాలని చూస్తుందని, అయితే అధికారంలో రావాలంటే మాత్రం బలంగా పోరాటం చేయాలని పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. అలాగే వారాహి వాహనంతో ఏపీలో రహదారుల మీద తిరుగుతానని, యాత్ర చేస్తానని, తన మీద అరిచే వైసీపీ గాడిదలు ఏ విధంగా అడ్డుకుంటారో చూస్తానని, మీరు అడ్డుకుంటే నేనేంటో చూపిస్తా అంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. గత కొంత కాలంగా తనపై వైసీపీ నేతలు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసారో అన్నింటికీ కూడా పవన్ కళ్యాణ్ ఈ సభా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

20 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

22 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.