Categories: LatestNewsPolitics

Janasena Party: జనసేనని దెబ్బెసిన ఎలక్షన్ కమిషన్

Janasena Party: ఎన్నికలకి మరో ఏడాది మాత్రమే ఉంది. వచ్చి ఎలక్షన్స్ లో కచ్చితంగా బలమైన స్థానాలలో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృఢసంకల్పంతో ఉన్నారు. అలాగే వైసీపీని గద్దె దించడానికి బలమైన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఊహించని విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చే న్యూస్ బయటకొచ్చింది. జనసేన పార్టీకి కామన్ సింబల్ గా ఉన్న గాజుగ్లాసుని ఇప్పుడు ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ గా మార్చేసింది. జనసేన అబ్యర్ధనని తోసిపుచ్చి మరీ ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

గాజు గ్లాసు గుర్తుపైన జనసేన 2019 ఎన్నికలలో పోటీ చేసింది. తరువాత తక్కువ స్థానాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసింది. అయితే కామన్ సింబల్ కావాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల మేరకు జనసేన పార్టీ లేదని ఈసీ డిసైడ్ అయ్యి గాజుగ్లాసు గుర్తుని కామన్ సింబల్ గా తొలగించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఇది ఆ పార్టీకి షాక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. పొత్తులలో భాగంగా వెళ్తున్న జనసేన పార్టీకి కామన్ సింబల్ అది కూడా గాజు గ్లాసు ఉంటే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది.

పవన్ కళ్యాణ్ అనుకున్నట్లు బలమైన స్థానాలలో గెలిచే అవకాశం ఉండేది. అయితే ఒక్కో అభ్యర్ధికి ఒక్కో గుర్తు కేటాయించడం వలన ఇప్పుడు ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. జనసేనకి ఓటు వేయాలని అనుకున్న ఏ గుర్తు అభ్యర్ధి జనసేన అనేది తెలిసే అవకాశం తక్కువ ఉంటుంది. ఇది ఫలితాలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. మళ్ళీ గాజు గ్లాసు సింబల్ సాధించుకుంటారా అనేది చూడాలి. 

Varalakshmi

Recent Posts

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

1 hour ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

11 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

18 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

1 day ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

2 days ago

Andhra Pradesh: జగన్ షాకింగ్ డెసిషన్.. వైసీపీ నేత‌ల్లో గుబులు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…

3 days ago

This website uses cookies.