Janasena Party: ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయాలు ఆ పార్టీ ఎదుగుదలకి ఆటంకం కలిగిస్తున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తుంది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పార్టీని నడిపించడంలో ఎందుకనో ఓ రకమైన భయంతోనే వెళ్తున్నారు. సంస్థాగతంగా నిర్మాణం చేసుకోకుండా కేవలం జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపించేలా చేసుకున్నారు. గ్రౌండ్ లెవల్ లో నాయకత్వాన్ని తయారు చేసే పనిపై అస్సలు దృష్టి పెట్టలేదు అనేది రాజకీయ విశ్లేషకులు పదే పదే చేసే విమర్శలు. సుదీర్ఘ రాజకీయ లక్ష్యాలు పెట్టుకున్నా కూడా ప్రజలలోకి బలంగా వెళ్లి. పార్టీకి గ్రౌండ్ లెవల్ లోకి బలంగా తీసుకెళ్ళే నాయకులని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ బలంగా నిలబడింది అంటే అ రోజు ఎన్టీఆర్ ముందుగా నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులని తయారు చేసుకొని వారిని తెలుగుదేశం ప్రతినిధులుగా ప్రజలలోకి తీసుకెళ్ళారు. అలా వారికి కూడా గుర్తింపు ఇవ్వడం ద్వారా ఆ ఎన్నికలలో ప్రజలు ఎన్టీఆర్ చరిష్మాతో పాటు స్థానిక నాయకులని చూసి ఓట్లు వేసి అఖండ మెజారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఆ నాయకత్వం శూన్యత మాత్రం పదేళ్ళు అయినా ఇంకా ఉంది. నియోజకవర్గాలలో ఉన్న నాయకులని తాను ముందు నిలబడి ప్రజలకి పరిచయం చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఒక వేళ నాయకుడిని పరిచయం చేస్తే వారు తరువాత అమ్ముడుపోతారని, లేదంటే ప్రస్తుతం అక్కడ పాతుకుపోయిన నాయకుల బెదిరింపులకి భయపడపోతారని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.
అయితే ప్రజలని ఆకర్షించాలంటే కేవలం పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ ఉంటే సరిపోదు. ఆ పవన్ కళ్యాణ్ వెనుక నిలబడే సైన్యం బలంగా కనిపించాలి. కాని అలా కనిపించడం లేదు.పోనీ ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు పార్టీలోకి వస్తామని చెబుతున్నా వారి ఎంట్రీ కి పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం లేదు అనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. గత ఎన్నికలలో చాలా మంది కాపు నాయకులు పవన్ కళ్యాణ్ తో చర్చించి కూడా ఆ పార్టీలోకి వెళ్ళకుండా ఆగిపోయారు. ఇప్పుడు మరోసారి అలాంటి తప్పిదమే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాత నాయకులకి స్థానం లేదు. కొత్త నాయకత్వం తయారు కాలేదు. ఇప్పుడు జనసేనాని ప్రయాణం ఎలా ఉంటుంది అనేది చాలా మంది ప్రశ్న
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.