Janasena Party: ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయాలు ఆ పార్టీ ఎదుగుదలకి ఆటంకం కలిగిస్తున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తుంది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పార్టీని నడిపించడంలో ఎందుకనో ఓ రకమైన భయంతోనే వెళ్తున్నారు. సంస్థాగతంగా నిర్మాణం చేసుకోకుండా కేవలం జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపించేలా చేసుకున్నారు. గ్రౌండ్ లెవల్ లో నాయకత్వాన్ని తయారు చేసే పనిపై అస్సలు దృష్టి పెట్టలేదు అనేది రాజకీయ విశ్లేషకులు పదే పదే చేసే విమర్శలు. సుదీర్ఘ రాజకీయ లక్ష్యాలు పెట్టుకున్నా కూడా ప్రజలలోకి బలంగా వెళ్లి. పార్టీకి గ్రౌండ్ లెవల్ లోకి బలంగా తీసుకెళ్ళే నాయకులని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ బలంగా నిలబడింది అంటే అ రోజు ఎన్టీఆర్ ముందుగా నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులని తయారు చేసుకొని వారిని తెలుగుదేశం ప్రతినిధులుగా ప్రజలలోకి తీసుకెళ్ళారు. అలా వారికి కూడా గుర్తింపు ఇవ్వడం ద్వారా ఆ ఎన్నికలలో ప్రజలు ఎన్టీఆర్ చరిష్మాతో పాటు స్థానిక నాయకులని చూసి ఓట్లు వేసి అఖండ మెజారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఆ నాయకత్వం శూన్యత మాత్రం పదేళ్ళు అయినా ఇంకా ఉంది. నియోజకవర్గాలలో ఉన్న నాయకులని తాను ముందు నిలబడి ప్రజలకి పరిచయం చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఒక వేళ నాయకుడిని పరిచయం చేస్తే వారు తరువాత అమ్ముడుపోతారని, లేదంటే ప్రస్తుతం అక్కడ పాతుకుపోయిన నాయకుల బెదిరింపులకి భయపడపోతారని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.
అయితే ప్రజలని ఆకర్షించాలంటే కేవలం పవన్ కళ్యాణ్ అనే ఫ్యాక్టర్ ఉంటే సరిపోదు. ఆ పవన్ కళ్యాణ్ వెనుక నిలబడే సైన్యం బలంగా కనిపించాలి. కాని అలా కనిపించడం లేదు.పోనీ ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు పార్టీలోకి వస్తామని చెబుతున్నా వారి ఎంట్రీ కి పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం లేదు అనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. గత ఎన్నికలలో చాలా మంది కాపు నాయకులు పవన్ కళ్యాణ్ తో చర్చించి కూడా ఆ పార్టీలోకి వెళ్ళకుండా ఆగిపోయారు. ఇప్పుడు మరోసారి అలాంటి తప్పిదమే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాత నాయకులకి స్థానం లేదు. కొత్త నాయకత్వం తయారు కాలేదు. ఇప్పుడు జనసేనాని ప్రయాణం ఎలా ఉంటుంది అనేది చాలా మంది ప్రశ్న
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.