Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వమే లక్ష్యంగా తన విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఇప్పటంలో రహదారి విస్తరణ కారణంగా ఇళ్ళు ద్వంసం అయిన బాధితులకి లక్ష రూపాయిల పరిహారం ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పటం ప్రజలు చూపించినంత తెగువ అమరావతి రైతులలో ఉండి ఉంటే వైసీపీ రాజధానిని కదిలించే ధైర్యం చేసేది కాదని అన్నారు. విద్వంసమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతుందని, ప్రజల ఇళ్ళు కూలగొట్టి వారి ఉసురు పోసుకున్న ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుందని అన్నారు. తమని ముఖ్యమంత్రి జగన్ రౌడీ సేన అంటున్నారని, అయితే తమది విప్లవ సేన అని, రౌడీలసేన కాదని కౌంటర్ ఇచ్చారు. రౌడీలు ఉన్న పార్టీ వైసీపీ అనిఅన్నారు .
వైసీపీ ఒక ఉగ్రవాద పార్టీగా ఆ పార్టకి ఉగ్రవాద సలహాలు ఇచ్చే వ్యక్తిగా సజ్జల ఉన్నారని విమర్శించారు. ప్రకృతి వనరుని దోచుకోవడం విధ్వంసం చేయడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతుందని అన్నారు. ప్రకృతి వనరులని నాశనం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయనేది గరుడపురాణం చదివితే తెలుస్తుందని అన్నారు. తనకి ఒక్క అవకాశం ఇస్తే పాలన అంటే ఏంటో చూపిస్తా అని, అలాగే అభివృద్ధి ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తానని అన్నారు. అయితే ప్రజలు తనని గెలిపించిన, గెలిపించకున్నా తన ప్రాణం ఉన్నంత వరకు వారికి తాను అండగా నిలబడతానని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని పేర్కొన్నారు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.