Categories: LatestNewsPolitics

Politics: ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇచ్చిన జగన్… ఏకంగా 32 మందికి డెడ్ లైన్..

Politics: 2024లో కూడా ఎట్టి పరిస్థితిలో అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ దానికి తగ్గ కార్యాచరణ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. సంక్షేమ పథకాలే ఈ సారి వైసీపీకి మళ్ళీ అధికారం తీసుకోస్తాయమని జగన్ బలంగా నమ్ముతున్నట్లు అనిపిస్తుంది. ఎమ్మెల్యేలని నమ్మడం మానేసి పూర్తిగా తనని, తాను చేస్తున్న కార్యక్రమాలని నమ్ముకున్నారు. నెలకి కనీసం నాలుగు సార్లు ఏదో ఒక పథకం కోసం బటన్ నొక్కుతూ ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలకి మరో ఏడాదిన్నర సమయం ఉన్న నేపధ్యంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఏ స్థాయిలో లబ్ది పొందుతున్నారు అనేది జనాల్లోకి బలంగా తీసుకొని వెళ్ళడానికి వైసీపీ పార్టీ కోసం పనిచేసే గ్రామ సారథులని సిద్ధం చేస్తున్నారు.

అలాగే ప్రతి పంచాయితీని ఒక యూనిట్ గా చేసి మొత్తం ముగ్గురు ప్రతినిధులని బూత్ లెవల్ కమిటీలుగా ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒక మహిళ కూడా ఉండాలని ఇప్పటికే జిల్లా, నియోజకవర్గాల ఇన్ చార్జ్ లకి అల్టిమేటం జారీ చేశారు. ఇక ఆ ముగ్గురు పరిధిలో 50 ఇళ్ళు ఉంటాయని, ఆ ఇళ్ళకి వారు ప్రతి రోజు వెళ్తూ ఆయా కుటుంబాలతో మమేకం అవుతూ సంక్షేమ పథకాలు, జగనన్న ప్రజా రంజక పాలన గురించి గొప్పగా చెప్పి వారందరిని పార్టీ ఓటుబ్యాంకుగా మార్చాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు బూట్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేసే పనిలో వైసీపీ జిల్లా నాయకులు తలమునకలై ఉన్నారు. ఇదిలా ఉంటే మరో వైపు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక నుంచి ప్రజల్లోకి వెళ్లి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలని ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. తనకున్న నివేదిక ప్రకారం 40 శాతం ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని ఆరంభంలోనే చెప్పారు.

ఇక తాజాగా మూడో సారి గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం తీరు, అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ కి నివేదిక అందినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ సారి కాస్తా సీరియస్ గానే అందరికి క్లాస్ పీకారు. ఏకంగా 32 మంది ఎమ్మెల్యేల మీద ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉందని, వారందరూ వెంటనే తమ పద్ధతి మార్చుకొని ఆయా నియోజకవర్గాలలో ప్రజలకి చేరువ అవ్వాలని గట్టిగానే చెప్పారు. ఒక వేళ అలా వెళ్ళలేము అని ఎవరైనా అనుకుంటే ఇప్పుడే చెప్పాలని వారి స్థానంలో ఈ సారి మరొకరికి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని, ఇక మర్యాదగా తప్పుకున్న వారికి పార్టీలో ఇతర బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఏది ఏమైనా 175 సీట్లు మాత్రం ఈ సారి కచ్చితంగా రావాలని, సంక్షేమ పథకాల పట్ల ప్రజలలో మంచి స్పందన ఉందని, వాటిని ఇంకా ఎక్కువ మందికి చేరేలా చేయడంతో పాటు, మన పాలన వలన ఏ విధమైన సపోర్ట్ వారికి దొరుకుతుంది.

ఇక అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుంది అనేది కూడా తెలియజేయాలని సూచించారు. అలాగే వీటితో పాటు స్థానికంగా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తారు అనే నమ్మకం ఎమ్మెల్యేలు అందరూ కల్పించాలని అలా అయితేనే అనుకున్న లక్ష్యం సాధ్యం అవుతుందని చెప్పారు. అయితే ఈ సారి ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురుకాబోతున్న నేపధ్యంలో పక్కా కార్యాచరణ, వారిని దీటుగా ఎదుర్కొని ప్రజలకి చేరువ కావాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. మరి ఎమ్మెల్యేలు అందరూ జగన్ నిర్దేశించిన మార్గంలో వెళ్లి మళ్ళీ వైసీపీకి ఎంత వరకు పట్టం కడతారు అనేది ఇప్పుడు వేచి చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Fast Food: పిల్లలూ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? క్యాన్సర్ బారిన పడినట్లే?

Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…

3 hours ago

Tuesday Auspiciousness: మంగళవారం కొత్త పనులు ప్రారంభించవచ్చా? మంచిదేనా?

Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…

3 hours ago

Politics: టార్గెట్ 2029.. ఒక‌టే రూట్‌లో జ‌గన్‌, కేసీఆర్..!

Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…

1 day ago

Tollywood: ` మా ఇంటి బంగారం ` సామ్ క‌లెక్ష‌న్స్‌ కుమ్మేసిందంతే..!

Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…

1 day ago

AP POLITICS: వైసీపీకి బై బై.. ఆ పార్టీ వైపు మాజీ మంత్రి అవంతి చూపు..!

AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…

1 day ago

Banyan Leaves: మర్రి ఆకులతో ఈ దేవతలకు పూజ చేస్తున్నారా? పెద్ద తప్పు చేసినట్లే?

Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…

2 days ago

This website uses cookies.