Politics: పాదయాత్రతో గెలుపు కోసం… వైఎస్ఆర్ ని ఫాలో అవుతున్న రాహుల్..

Politics: రాజకీయాలలో అన్ని పార్టీలకి వ్యూహాలు ఉంటాయి. అయితే ఎన్ని వ్యూహాలు వేసిన చివరికి ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనేది వారి చేతుల్లోనే ఉంది. అయితే ప్రజలని వారి మాటలతో, చేతలతో ఎవరైతే ఆకర్షిస్తారో, అలాగే ఎవరి మీద ప్రజలు నమ్మకం చూపిస్తారో కచ్చితంగా ఆ నాయకుడికి, ఆ పార్టీకి మెజారిటీ ఇచ్చి ప్రభుత్వంలో కూర్చోబెడతారు. ఇండియాలో రాజకీయాలు అంటే కోట్ల రూపాయిల ఖర్చు అని అందరూ అంటారు. ఎన్నికలు వస్తే ప్రజలకి ఓటుకి 500 నుంచి 5000 వేల వరకు ఇచ్చే రాజకీయ నాయకులు ఉంటారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ల రూపంలో, అలాగే సంక్షేమం ద్వారా వచ్చే నిధులలో మిగిలించుకొని మళ్ళీ ఖర్చు పెట్టిన సొమ్ములు మొత్తం సంపాదించుకోవచ్చు అనేది చాలా మంది ఆలోచన. అదే ఆలోచనతో రాజకీయాలు చేస్తారు.

అయిత్తే కొంత మంది మాత్రం సిద్ధాంతాలతో రాజకీయాలు చేస్తూ, ప్రజలకి సేవ చేయడమే నాయకుడిగా మన లక్ష్యం అని అనుకుంటారు. అయితే ఈ రోజుల్లో అలాంటి నాయకులు అయితే ఎవరూ లేరు. ఇక ప్రజలు కూడా అలాంటి నాయకులు వస్తారని ఆశించడం లేదు. కాని ఉన్నదాంట్లో ఎంతో కొంత మేలు చేసేవాడు అయితే చాలు అని అనుకుంటున్నారు. అలా చూస్తూనే ఓట్లు వేస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో వారి నుంచి ఉచితంగా వచ్చే సొమ్ములు ఎందుకు వదులుకోవడం అనే కోణంలో ఆలోచించి అన్ని పార్టీలకి చెందిన నాయకుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. అయితే డబ్బులతో రాజకీయాలు నడుస్తున్న కూడా ప్రజల కష్టాలు తెలుసుకొని, వారికి దగ్గరగా వెళ్లి, వారు చెప్పే సమస్యలు వింటూ పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వారికి ప్రజలు పట్టం కట్టడం గత కొన్నేళ్ళ నుంచి చూస్తున్నాం. ఈ పద్ధతి ముందుగా ఏపీలో మొదలైంది.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి బస్సు యాత్ర ద్వారా ప్రజల మధ్యకి వెళ్లి వారి కష్టాలు విని, వారికి భరోసా ఇచ్చి ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చారు. మొదటి ఎన్నికలలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా భారీ మెజారిటీతో ఎన్టీఆర్ కి ప్రభుత్వ పగ్గాలని ప్రజలు అప్పగించారు. తరువాత తెలుగుదేశం వెలుగులో కనుమరుగు అయిన కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవం పోశారు. పాదయాత్రతో ప్రజలలోకి వెళ్లి. వారితో మమేకమై, ప్రజలు చెప్పే విషయాలు వింటూ, వారి కష్టాలకి భరోసా ఇస్తూ రాష్ట్రం మొత్తం తిరిగారు. దాంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. టీడీపీని ఓడించి భారీ మెజారిటీ ఇచ్చారు. తరువాత చంద్రబాబు కూడా పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్ళారు. అలాగే 2019 ఎన్నికలకి ముందు రెండేళ్ళ నుంచి ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రతి నియోజకవర్గం వెళ్ళారు. ప్రజలతో మమేకం అవుతూ వారితో కలిసిపోతూ ప్రజలకి నమ్మకం కలిగించి భారీ మెజారిటీతో ఏకంగా 154 నియోజకవర్గాలలో గెలిచి అధికారం సొంతం చేసుకున్నారు.

ఇలా తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ అయిన ఈ పాదయాత్ర ఫార్ములాని, జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఆకళింపు చేసుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపించిన మార్గంలో రాహుల్ గాంధీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల మధ్య తిరుగుతున్నాడు. అన్ని రాష్ట్రాలలో పాదయాత్ర చేస్తున్నాడు. రానున్న ఎన్నికలలో అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేస్తున్నాడు. తన భారత్ జోడో యాత్రతో తనపై ఉన్న పప్పు అనే ముద్రని కూడా పోగొట్టుకుంటూ మోడీ నేతృత్వంలో బలంగా ఉన్న బీజేపీతో తలపడేందుకు సిద్ధం అవుతున్నారు. మరి ఏపీలో నాయకులకి సక్సెస్ అందించిన ఈ పాదయాత్ర ఫార్ములా రాహుల్ గాంధీని ప్రధానిగా ఢిల్లీ పీఠంపై కూర్చోబెడుతుందా లేదా అనేది చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

13 hours ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

6 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

6 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.