Politics: బీజేపీపై కేసీఆర్ అస్త్రాలు సిద్ధమేనా… మోడీ లక్ష్యంగా విమర్శల దాడి

Politics: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొంతకాలంగా కేంద్రంలో అధికార బీజేపీ పార్టీ, ప్రధాని మోడీ, అమిత్ షా లక్ష్యంగా విమర్శల దాడి తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో బీజేపీ పార్టీ తనకి బలమైన ప్రత్యర్ధిగా మారుతుందని గ్రహించిన కేసీఆర్ తన వ్యూహాలకి తెరతీసారు. అందులో భాగంగా ఏకంగా మోడీపైనే విమర్శలు చేయడం ద్వారా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సహకారం కూడా చాలా కీలకం. అయితే బీజేపీతో కయ్యం పెట్టుకోవడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన చాలా నిధులు ఆగిపోతాయని కూడా కేసీఆర్ కి తెలుసు. అయితే దీనినే మరోసారి ప్రజలలో తనపై నమ్మకం పెంచుకోవడంతో పాటు తెలంగాణ అభివృద్ధికి బీజేపీ పార్టీ అడ్డం పడుతుందనే విమర్శలతో ప్రజలలో సెంటిమెంట్ ఎమోషన్ ని మళ్ళీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

మరో వైపు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయడానికి బీజేపీ వెనకనుండి పావులు కదుపుతుంది. బీజేపీ వ్యూహాలని ముందే పసిగట్టిన కేసీఆర్ వారికి దీటుగా తన ఆలోచనలకి పదును పెట్టి ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోళ్ళు వ్యవహారంలో బీజేపీ పార్టీ నేతలని రెడ్ హ్యాండడ్ టీఎస్ పోలీసులతో పట్టుకున్నారు. ఇక ఆ వ్యవహారం మునుగోడు ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా విజయాన్నిఅందించింది అనేది అందరూ ప్రత్యక్షంగా చూసారు. మరో వైపు లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత పేరుని రిమాండ్ రిపోర్ట్ లో చేర్చడం ద్వారా బీజేపీ పార్టీ కూడా తన రాజకీయ చతురతకి పదును పెట్టి టీఆర్ఎస్ పార్టీ మొత్తం స్కామ్ లు, అవినీతి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ప్రచారం ఆర్బాటం కల్పిస్తూ తెలంగాణ ప్రజలలో కేసీఆర్ పాలనపై వ్యతిరేకత పెంచుతున్నారు.

అలాగే మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు చేయించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలపై కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. దీని వెనుక బీజేపీ పార్టీ ఉందనే విషయం కేసీఆర్ కూడా గ్రహించారు. ఈ నేపధ్యంలో మరోసారి మహబూబ్ నగర్ వేదికగా జరిగిన బహిరంగ సభలో కేంద్రంలో బీజేపీ పార్టీ విధానాలపై నేరుగా విమర్శల దాడి చేశారు. తెలంగాణలో ఉన్న స్థాయిలో ఇండియాలో అభివృద్ధి లేదని, ఇదంతా ప్రధానిగా మోడీ వైఫల్యం వలనే అని చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది అని అన్నారు. ఏకంగా 3 లక్షల కోట్ల ఆదాయం తెలంగాణ ప్రాంతం బీజేపీ కారణంగా కోల్పోయిందని అన్నారు.

ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పి ప్రభుత్వాలు కూల్చే ప్రయత్నం మోడీ, అమిత్ షా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అండదండలు ఉంటే బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాలలోకి వెళ్లి బీజేపీతో బలంగా పోరాడుతానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. దీనిని బట్టి రానున్న రోజుల్లో కేసీఆర్ తన రాజకీయ చతురతతో తెలంగాణ ప్రజలని ప్రాంతీయ సెంటిమెంట్ తో రెచ్చగొట్టి బీజేపీ పార్టీ నుంచి ఎదురుకాబోయే పోటీ నుంచి బయటపడి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

5 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.