Political: జిల్లాల వారీగా జనవాణి ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయ క్షేత్రంలోకి చురుకుగా వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రతి నెల ఏదో ఒక రూపంలో ప్రజలలో ఉండాలని నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లు కనిపిస్తుంది. వైజాగ్ ఇష్యూ తర్వాత మంగళగిరి వేదికగా పీఏసీ మీటింగ్ ని పార్టీ ప్రతినిధులని పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఈ సమావేశంలో వైజాగ్ లో అక్రమ కేసులలో అరెస్ట్ చేయబడ్డవారికి ముందుగా అభినందిస్తూ సన్మానం చేశారు.
ఇక అనంతరం పార్టీ తీర్మానంలో భాగంగా జనవాణి కార్యక్రమాలని 26 జిల్లాలలో కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున వారి సమస్యలు చెప్పుకోవడానికి ముందుకి వస్తున్న నేపధ్యంలో జిల్లాల వారీగా ఈ జనవాణి కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధం అయినట్లు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇక ఈ సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఎప్పటిలాగే విమర్శలు చేశారు. నియంతృత్వం పెరిగిపోయి, ప్రజలని భయపెట్టి, వారి స్వేచ్ఛని హరించే విధంగా నాయకులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. అరాచక శక్తులు అధికారంలో ఉంటే ప్రజలు అంధకారంలోకి వెళ్ళిపోతారని, వారి తరుపున జనసేన నిరంతర పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.
అలాగే కాపు నాయకులు అందరిని ఒకే వేదికపై తీసుకొచ్చి జనసేన పార్టీకి అండగా ఉండే విధంగా వెనక నుండి నాయకులతో సామాజిక సమీకరణాలు కూడా నడుపుతున్నారని టాక్ ఉంది. మరో వైపు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వెనుక లేదని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి వైసీపీ కాపునేతలు సిద్ధం అవుతున్నారు. ఓ వైపు బీసీ సంఘం సమావేశాలు నిర్వహిస్తూ ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకు పోకుండా జాగ్రత్తలు పడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…
AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…
pomegranate: సాధారణంగా మన ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందాలి అంటే తప్పనిసరిగా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలతో పాటు…
TTD: తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు. ఇక స్వామివారిని…
This website uses cookies.