Health care: మన శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరగాలి అంటే తప్పనిసరిగా పోషకాలు ఎంతో అవసరం అయితే మనం తీసుకునే ఆహారాలలో పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి అయితే సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల మన శరీరంలో ఐరన్ కాల్షియం వంటి పోషకాలు లోపించి ఎన్నో ఇబ్బందులవుతాయి. ఇలా సమస్యలతో బాధపడేవారు ఆహారంతో పాటు మరి టాబ్లెట్స్ రూపంలో కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు.
ఇక ఐరన్ కాల్షియం మాత్రలు ఉపయోగించేవారు ఒకేసారి రెండు టాబ్లెట్లను వేసుకుంటూ ఉంటారు అయితే ఇలా వేసుకోవడం మంచిదేనా వేసుకుంటే ఏం జరుగుతుందనే విషయాల గురించి తెలుసుకుందాం.. నిజానికి ఐరన్ క్యాల్షియం మాత్రలు ఉపయోగించేవారు రెండు టాబ్లెట్స్ ఒకేసారి వేసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రెండు ఒకేసారి వేసుకోవడం వల్ల ఈ పోషకాలు మన శరీరానికి సరైన స్థాయిలో అందవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా క్యాల్షియం ట్యాబ్లెట్లు ఐరన్ శోషణను 40 నుంచి 60 శాతం మేర తగ్గించేస్తాయి. అంటే మీరు రెండు ట్యాబ్లెట్లను ఒకేసారి వేసుకుంటే మీరు వేసుకునే ఐరన్ ట్యాబ్లెట్లలో కేవలం 40 నుంచి 60 శాతం వరకు మాత్రమే మీ శరీరం శోషించుకుంటుందన్నమాట. కనుక ఈ రెండు ట్యాబ్లెట్లను వేసుకునేందుకు తప్పనిసరిగా 30 నిమిషాల గ్యాప్ అయినా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ ట్యాబ్లెట్లను వాడే సమయంలో క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోరాదు. లేదంటే ఐరన్ శోషణ తగ్గిపోతుంది. అలాగే ఐరన్ ను శరీరం ఎక్కువగా శోషించుకోవాలంటే ఉదయం ఖాళీ కడుపుతో ఆ ట్యాబ్లెట్లను తీసుకోవాలి. లేదంటే భోజనం చేసే ముందు వేసుకోవాలి.
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
This website uses cookies.