Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన గండిపేటలో ఓ భారీ భూకుంభకోణం వెలుగుచూసింది. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కొట్టేసేందుకు జరిగిన ఓ హైడ్రామాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ మెగా స్కామ్ వెనుక ఏపీకి చెందిన అధికార పక్ష మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల హస్తం ఉన్నట్లు తేలడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.
గండిపేట పరిధిలోని సర్వే నంబర్ 18లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని టార్గెట్ చేసిన సదరు ముఠా, గత ప్రభుత్వ హయాంలోనే దీనికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే ఈ భూమిని తమకు కేటాయించిందంటూ కొన్ని నకిలీ జీవోలను సృష్టించారు. చట్టబద్ధంగా ఎలాంటి హక్కులు లేకపోయినా, ఈ ఫోర్జరీ పత్రాల ఆధారంగా ఆ భూమిని తమ పేరిట మార్చేసుకుని, ఆపై ఎకరా రూ.3.5 కోట్ల చొప్పున ఇతరులకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేశారు.
అనుకున్న ప్లాన్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ వ్యవహారంలో ఏదో తేడా కొడుతోందని గండిపేట తహసీల్దార్ అనుమానించారు. సదరు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తహసీల్దార్ రిజిస్ట్రేషన్ను నిలిపివేసి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వెయ్యి కోట్ల దందా గుట్టు రట్టయింది.
ఈ కేసుపై శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ ల్యాండ్ స్కామ్ వెనుక పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన సోదరుడు రమేశ్తో పాటు మరికొందరు ఉన్నట్లు గుర్తించారు. ఈ అక్రమ డీల్ కోసం దాదాపు 4 కోట్ల రూపాయలు చేతులు మారాయని, ఆ నగదు స్వయంగా మాజీ ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచే రెండు విడతలుగా బదిలీ అయినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో, అరెస్ట్ భయంతో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆయన సోదరుడు పరారయ్యారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మద్యం, ఇసుక, మైనింగ్ అక్రమాలపై ఇప్పటికే విచారణలు ఎదుర్కొంటున్న సదరు పార్టీకి, ఈ రూ. 1000 కోట్ల హైదరాబాద్ భూదందా వ్యవహారం మరింత తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది.
YSRCP: నిన్నటివరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ‘ఫ్రెండ్లీ’గా ఉంటూ, తెరవెనుక స్నేహాన్ని నడిపిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్…
TDP PARTY: దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని…
AP POLITICS: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ - ప్రొఫెసర్…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'పవర్ సెంటర్' అనగానే ఒకప్పుడు వైఎస్సార్ నీడ సూరీడు గుర్తుకొచ్చేవారు. సరిగ్గా అదే తరహాలో…
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో…
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంటుంది. అయితే ఈసారి పొలిటికల్ స్క్రీన్ పైకి…
This website uses cookies.