Health Tips: ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలో కొన్ని ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. సాధారణంగా మన భారత దేశంలో ఎక్కువమంది గోధుమ రొట్టెలు ఆహారంగా తీసుకుంటారు. ముఖ్యంగా వీటిని నూనె వేసి వండకుండా పుల్కా చేసి ఆహారంగా తీసుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో పుల్కా తయారు చేయడానికి పెనం మీద కాకుండా నేరుగా మంట మీద పెట్టీ పుల్కాలు చేస్తున్నారు. ఇలా నేరుగా గ్యాస్ మంట మీద చేసిన పుల్కాలు తినటం వల్ల క్యాన్సర్ సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం గ్యాస్ స్టవ్లు, కుక్టాప్లు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అనే కొన్ని ప్రమాదకరమైన పదార్థాలను విడుదల చేస్తాయి. ఈ వాయువులు శ్వాసకోశ వ్యాధులకు కారణం అవుతాయని WHO వెల్లడించింది. ఇవి కార్డియోవాస్కులర్ సమస్యలతో పాటు క్యాన్సర్, ఇతర ఆరోగ్య సంబంధిత వ్యాధులు రావటానికి కారణం అవుతాయి. అంతే కాకుండా న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్ అనే పేరుతో ఒక అధ్యయనం కూడా పత్రికలో ప్రచురించబడింది. ఈ అధ్యాయం ప్రకారం అధిక ఉష్ణోగ్రత వద్ద పుల్కాను కాల్చడం వల్ల క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు.
ఫుడ్ స్టాండర్డ్స్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ చీఫ్ సైంటిస్ట్ ప్రచురించిన ఒక నివేదికలో, డాక్టర్. పాల్ బ్రెంట్ మాట్లాడుతూ… గోధుమ పిండితో చేసే పుల్కాలని నేరుగా గ్యాస్ మంట మీద కాల్చినప్పుడు, అది చక్కెర , కొంత అమైనో మిశ్రమం అయిన అక్రిలమైడ్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది.ఇలా చేయటం వల్ల పుల్కా కాలిన టేస్ట్ ఉన్నప్పటికీ, గోధుమ పిండిలో కొంత మొత్తంలో ఉన్న చక్కెరలు వల్ల క్యాన్సర్ కారక రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. అందుకే పుల్కాలను నేరుగా మంటపై ఇలా కాల్చడం వల్ల క్యాన్సర్ సమస్యలు తలెత్తుతాయని వెల్లడించాడు. అలాగే గ్యాస్ మంటలపై నేరుగా మాంసాన్ని కాల్చడం వల్ల కూడా క్యాన్సర్ సంబంధిత సమస్యలు తలెత్తి ప్రమాదం ఉంటుంది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.