Health Tips: ప్రస్తుత కాలంలో అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలో కొన్ని ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. సాధారణంగా మన భారత దేశంలో ఎక్కువమంది గోధుమ రొట్టెలు ఆహారంగా తీసుకుంటారు. ముఖ్యంగా వీటిని నూనె వేసి వండకుండా పుల్కా చేసి ఆహారంగా తీసుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో పుల్కా తయారు చేయడానికి పెనం మీద కాకుండా నేరుగా మంట మీద పెట్టీ పుల్కాలు చేస్తున్నారు. ఇలా నేరుగా గ్యాస్ మంట మీద చేసిన పుల్కాలు తినటం వల్ల క్యాన్సర్ సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం గ్యాస్ స్టవ్లు, కుక్టాప్లు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అనే కొన్ని ప్రమాదకరమైన పదార్థాలను విడుదల చేస్తాయి. ఈ వాయువులు శ్వాసకోశ వ్యాధులకు కారణం అవుతాయని WHO వెల్లడించింది. ఇవి కార్డియోవాస్కులర్ సమస్యలతో పాటు క్యాన్సర్, ఇతర ఆరోగ్య సంబంధిత వ్యాధులు రావటానికి కారణం అవుతాయి. అంతే కాకుండా న్యూట్రిషన్ అండ్ క్యాన్సర్ అనే పేరుతో ఒక అధ్యయనం కూడా పత్రికలో ప్రచురించబడింది. ఈ అధ్యాయం ప్రకారం అధిక ఉష్ణోగ్రత వద్ద పుల్కాను కాల్చడం వల్ల క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు.
ఫుడ్ స్టాండర్డ్స్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ చీఫ్ సైంటిస్ట్ ప్రచురించిన ఒక నివేదికలో, డాక్టర్. పాల్ బ్రెంట్ మాట్లాడుతూ… గోధుమ పిండితో చేసే పుల్కాలని నేరుగా గ్యాస్ మంట మీద కాల్చినప్పుడు, అది చక్కెర , కొంత అమైనో మిశ్రమం అయిన అక్రిలమైడ్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది.ఇలా చేయటం వల్ల పుల్కా కాలిన టేస్ట్ ఉన్నప్పటికీ, గోధుమ పిండిలో కొంత మొత్తంలో ఉన్న చక్కెరలు వల్ల క్యాన్సర్ కారక రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. అందుకే పుల్కాలను నేరుగా మంటపై ఇలా కాల్చడం వల్ల క్యాన్సర్ సమస్యలు తలెత్తుతాయని వెల్లడించాడు. అలాగే గ్యాస్ మంటలపై నేరుగా మాంసాన్ని కాల్చడం వల్ల కూడా క్యాన్సర్ సంబంధిత సమస్యలు తలెత్తి ప్రమాదం ఉంటుంది.
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
Political News: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలు ఇరు ప్రాంతాల భవిష్యత్తును శాసిస్తున్నాయి.…
This website uses cookies.