Health Tips: ప్రస్తుత కాలంలో ప్రజలు తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో మాత్రం ప్రకృతిలో ఉండే కొన్ని రకాల మొక్కలు వాటి పేర్లు ఉపయోగించి ప్రాణాంతక వ్యాధులను కూడా తగ్గించేవారు. ఇలా ఇప్పటికీ ప్రకృతిలో సహజంగా పెరిగే కొన్ని మొక్కలు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అటువంటి వాటిలో మోదుగ చెట్టు కూడా ఒకటి. రోడ్ల పక్కన, అడవుల్లో విచ్చలవిడిగా పెరిగి ఈ చెట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
దీన్ని ఔషధంగా మాత్రమే కాకుండా హోమ ద్రవ్యంగా కూడా ఉపయోగిస్తారు. మోదుగ చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చెట్టు బెరడు కారం, చేదు, వగరుగా ఉంటుంది. మోదుగ చెట్టు కాడను దంచి దానిని పేస్ట్ లాగా చేసి మొలలపై రాసి కట్టు కడితే. మొలల సమస్య క్రమంగా తగ్గుతుంది. అలాగే ఈ చెట్టు గింజలు తేలు కాటుకు విరుగుడుగా కూడా పని చేస్తాయి. మోదుగ చెట్టు గింజలను జిల్లేడు పాలతో కలిపి మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని తేలు కాటుకు గురి అయిన చోట రాయాలి. ఇలా చేయడం వల్ల తేలు కాటు వల్ల కలిగే బాధ చాలా త్వరగా తగ్గుతుంది.
అలాగే పిల్లల్లో వచ్చే నులిపురుగుల సమస్యను తగ్గించడంలో కూడా ఈ మోదుగ చెట్టు ఎంతో సహాయపడుతుంది. మోదుగ చెట్టు విత్తనాలను పొడిగా చేసి ఈ పొడిని తేనెతో కలిపి పిల్లలకు ఇవ్వటం వల్ల నులి పురుగుల సమస్య ఈజీగా తగ్గుతుంది. అలాగే నీళ్ళ విరేచనాలతో ఇబ్బంది పడేవారు చెట్టు జిగురును ఎండబెట్టి దానిని దంచి పొడిగా చేయాలి . 10 గ్రాముల మోదుగ జిగురు పొడి తో పాటు 10 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపిఈ మిశ్రమాన్ని మూడ పూటలా అర టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల నీళ్ల విరోచనాల సమస్య పూర్తిగా తగ్గుతుంది.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కార్యాలయాల వరకు త్వరలోనే ఒక భారీ మార్పు రాబోతోంది. ఇన్నాళ్లూ ఉద్యోగులు…
TDP PARTY: రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంటే ఒక డిసిప్లిన్. ఆయన పనితీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి…
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
This website uses cookies.