Categories: LatestNewsPolitics

AP Capital: రాజధానిపై ఒక్కొక్కరిది ఒక్కో మాట. వైసీపీ మంత్రుల తీరే అంత

AP Capital: మూడు రాజధానులు అంటూ హడావిడి చేసిన వైసీపీ పార్టీ కొద్ది రోజులుగా ఏపీ రాజధాని విశాఖపట్నం అంటూ పెట్టుబడీదారుల సదస్సులో అందరి దృష్టికి తీసుకొని వెళ్తుంది. ప్రజలకి చెప్పేది ఒక మాట అయితే పారిశ్రామిక వేత్తలకి మాత్రం ఏపీ రాజధాని విశాఖ మాత్రమే అని చెబుతున్నారు. ఇక అక్కడ మీటింగ్ లో చెప్పిన వెంటనే మరల ఏపీలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మొదలు పెడతాయని వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకి వచ్చి మా విధానం మూడు రాజదానులే. అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ అదే పల్లవి అందుకోవడం చేస్తున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ ఏపీకి రాజధానిగా విశాఖ ఉండబోతుంది అని చెప్పారు. అక్కడికి తాను షిఫ్ట్ అవుతున్నా అని, మీరు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరారు.

 

అది జరిగిన తర్వాత విపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. ఇక సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు మరికొంత మంది మంత్రులు మీడియా ముందుకి వచ్చారు. మూడు రాజధానులకి వైసీపీ కట్టుబడి ఉందని చెప్పారు. ఇక తాజాగా బెంగుళూరులో జరిగిన సమ్మిట్ లో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీకి ఒకటే రాజధాని అని అది విశాఖపట్నం మాత్రమే అని పేర్కొన్నారు. మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్ తో ప్రచారంలోకి వచ్చింది అంటూ పేర్కొన్నారు. అమరావతిలో ఒక అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి. అలాగే కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు జరుగుతుంది అని చెప్పారు. ఇక దీనిపై తెలుగుదేశం పార్టీ విమర్శలు మొదలు పెట్టింది. దీంతో సజ్జల యదావిధిగా మీడియా ముందుకి వచ్చి బుగ్గన వ్యాఖ్యల ప్రభావం తగ్గించే ప్రయత్నం చేశారు.

 

వైసీపీ లక్ష్యం మూడు రాజధానులు అంటూ చెప్పారు. అలాగే మంత్రి అంబటి రాంబాబు కూడా మూడు రాజధానులకి వైసీపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అలాగే మరికొంత మంది మంత్రులు కూడా మీడియా ముందుకి వచ్చి మూడు రాజధానులు వైసీపీ అజెండా అని, ఇందులో ఎలాంటి మార్పు లేదని సమర్ధించారు. అయితే వారు చేసిన కామెంట్స్ లో మరి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యపై క్లారిటీ మాత్రం ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. దీంతో వైసీపీ మంత్రులు, నాయకుల తీరు ఒక్కొక్కరిది ఒక్కోలా ఉందని టీడీపీ నేతలు విమర్శలు స్టార్ట్ చేశారు.

 

రాజధానులపై ఎవరి అభిప్రాయం కూడా కరెక్ట్ గా లేదని, ఎవరికి నచ్చింది వారు చెబుతున్నారు అంటూ యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. మరో వైపు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా  విశాఖ రాజధానిగా ఉండాలని అక్కడి వారే కోరుకోవడం లేదని పేర్కొన్నారు. అలాగే రాజధాని మార్పుపై వైసీపీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు.

Varalakshmi

Recent Posts

Fast Food: పిల్లలూ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? క్యాన్సర్ బారిన పడినట్లే?

Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…

10 hours ago

Tuesday Auspiciousness: మంగళవారం కొత్త పనులు ప్రారంభించవచ్చా? మంచిదేనా?

Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…

10 hours ago

Politics: టార్గెట్ 2029.. ఒక‌టే రూట్‌లో జ‌గన్‌, కేసీఆర్..!

Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…

1 day ago

Tollywood: ` మా ఇంటి బంగారం ` సామ్ క‌లెక్ష‌న్స్‌ కుమ్మేసిందంతే..!

Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…

1 day ago

AP POLITICS: వైసీపీకి బై బై.. ఆ పార్టీ వైపు మాజీ మంత్రి అవంతి చూపు..!

AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…

1 day ago

Banyan Leaves: మర్రి ఆకులతో ఈ దేవతలకు పూజ చేస్తున్నారా? పెద్ద తప్పు చేసినట్లే?

Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…

2 days ago

This website uses cookies.