Categories: LatestNewsPolitics

AP Capital: రాజధానిపై ఒక్కొక్కరిది ఒక్కో మాట. వైసీపీ మంత్రుల తీరే అంత

AP Capital: మూడు రాజధానులు అంటూ హడావిడి చేసిన వైసీపీ పార్టీ కొద్ది రోజులుగా ఏపీ రాజధాని విశాఖపట్నం అంటూ పెట్టుబడీదారుల సదస్సులో అందరి దృష్టికి తీసుకొని వెళ్తుంది. ప్రజలకి చెప్పేది ఒక మాట అయితే పారిశ్రామిక వేత్తలకి మాత్రం ఏపీ రాజధాని విశాఖ మాత్రమే అని చెబుతున్నారు. ఇక అక్కడ మీటింగ్ లో చెప్పిన వెంటనే మరల ఏపీలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మొదలు పెడతాయని వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకి వచ్చి మా విధానం మూడు రాజదానులే. అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ అదే పల్లవి అందుకోవడం చేస్తున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ ఏపీకి రాజధానిగా విశాఖ ఉండబోతుంది అని చెప్పారు. అక్కడికి తాను షిఫ్ట్ అవుతున్నా అని, మీరు కూడా వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరారు.

 

అది జరిగిన తర్వాత విపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. ఇక సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు మరికొంత మంది మంత్రులు మీడియా ముందుకి వచ్చారు. మూడు రాజధానులకి వైసీపీ కట్టుబడి ఉందని చెప్పారు. ఇక తాజాగా బెంగుళూరులో జరిగిన సమ్మిట్ లో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీకి ఒకటే రాజధాని అని అది విశాఖపట్నం మాత్రమే అని పేర్కొన్నారు. మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్ తో ప్రచారంలోకి వచ్చింది అంటూ పేర్కొన్నారు. అమరావతిలో ఒక అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి. అలాగే కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు జరుగుతుంది అని చెప్పారు. ఇక దీనిపై తెలుగుదేశం పార్టీ విమర్శలు మొదలు పెట్టింది. దీంతో సజ్జల యదావిధిగా మీడియా ముందుకి వచ్చి బుగ్గన వ్యాఖ్యల ప్రభావం తగ్గించే ప్రయత్నం చేశారు.

 

వైసీపీ లక్ష్యం మూడు రాజధానులు అంటూ చెప్పారు. అలాగే మంత్రి అంబటి రాంబాబు కూడా మూడు రాజధానులకి వైసీపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అలాగే మరికొంత మంది మంత్రులు కూడా మీడియా ముందుకి వచ్చి మూడు రాజధానులు వైసీపీ అజెండా అని, ఇందులో ఎలాంటి మార్పు లేదని సమర్ధించారు. అయితే వారు చేసిన కామెంట్స్ లో మరి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యపై క్లారిటీ మాత్రం ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. దీంతో వైసీపీ మంత్రులు, నాయకుల తీరు ఒక్కొక్కరిది ఒక్కోలా ఉందని టీడీపీ నేతలు విమర్శలు స్టార్ట్ చేశారు.

 

రాజధానులపై ఎవరి అభిప్రాయం కూడా కరెక్ట్ గా లేదని, ఎవరికి నచ్చింది వారు చెబుతున్నారు అంటూ యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. మరో వైపు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా  విశాఖ రాజధానిగా ఉండాలని అక్కడి వారే కోరుకోవడం లేదని పేర్కొన్నారు. అలాగే రాజధాని మార్పుపై వైసీపీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు.

Varalakshmi

Recent Posts

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

15 hours ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

18 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

3 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

4 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

4 days ago

This website uses cookies.