మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు దేవున్ని పూజించడం వల్ల
జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా పూజా సమయంలో పలికే వేద మంత్రాలు అత్యంత ప్రభావవంతమైనవిగా పరిగణిస్తారు. ఇలా వేదమంత్రాల నడుమ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు అయితే వేదమంత్రాలతో పూజలు చేసేవారు ఈ మాలను ధరించి పూజ చేయడం వల్ల తప్పనిసరిగా సకల దేవతల అనుగ్రహం మనపై ఉంటుంది.
ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అమ్మవారిని పూజించే సమయంలో స్పటిక మాల ధరించడం ఎంతో అవసరం. స్ఫటిక మాల ధరించి లక్ష్మీ దేవిని ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. స్ఫటికాలతో చేసిన మాలను ఉపయోగించి పూజ చేయడం ద్వారా శుక్ర గ్రహా అనుగ్రహాన్ని పొందవచ్చు. స్ఫటిక మాలతో శుక్రుని మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేసే సమయంలో స్పటికమాలను ధరించి పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది. ఇక అమ్మవారిని పూజించేటప్పుడు స్పటిక మాల ధరించి పంచవక్త్ర: స్వయం రుద్ర: కాలాగ్నిర్నామ నమతః అనే మంత్రాన్ని జపించాలి . ఇలా చేయటం వల్ల ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది.ఇక పూజ గదిలో లక్ష్మీదేవి అమ్మవారికి స్పటికమాలను వేయడం వల్ల కూడా డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి స్పటిక మాల ఎంతో ఉపశమనం కలిగిస్తుందని చెప్పాలి.
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
International Yoga Day 2026: ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక…
Puranapanda Srinivas: హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా…
This website uses cookies.