Devotional Tips: సాధారణంగా ఇంట్లో కనుక మరణం సంభవిస్తే ఆ ఇంట్లోని వారు ఏడాది పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకూడదని గుళ్ళకు వెళ్లకూడదని చాలామంది భావిస్తూ ఉంటారు. ఏడాది పూర్తి అయిన తర్వాత తిరిగి ఇంట్లో యధావిధిగా పూజలు చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి శుభకార్యాలైన చేసుకోవచ్చని చాలామంది చెబుతున్నారు. మరి నిజంగానే ఇంట్లో మరణం సంభవించిన తర్వాత ఏడాది పాటు పూజలు చేయకూడదా శాస్త్రం ఏం చెబుతుందనే విషయానికి వస్తే..
శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే మరణం సంభవించుంటుందో ఆ ఇంట్లో 11 రోజులపాటు ఎలాంటి పూజా కార్యక్రమాలను కానీ దీపం కానీ వెలిగించకూడదు. అయితే 11వ దినం పూర్తయిన తర్వాత 12వ రోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఆ రోజు నుంచి యధావిధిగా ఆ ఇంట్లో పూజ కార్యక్రమాలను చేయవచ్చని పండితులు చెబుతున్నారు. దీపం ఏ ఇంట్లో అయితే వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలవై ఉంటారని భావిస్తారు. అందుకే మరణం సంభవించిన ఇంట్లో కూడా 11 రోజుల తర్వాత దీపం వెలిగించుకోవడం శుభమని పండితులు చెబుతున్నారు.
ఇక చాలామంది ఏడాది పాటు దీపం చేయకూడదని పూజ సామాగ్రిని దేవుడి ఫోటోలను కూడా భద్రంగా దాచి పెట్టి ఉంటారు అలా చేయడం మంచిది కాదు.ఇలా ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవచ్చు గుడికి కూడా వెళ్ళవచ్చు కానీ హోమం యాగం వంటి వాటిని చేయకూడదు అలాగే నూతన గృహప్రవేశం చేయటం కొత్త కారు ,భూమి వంటి వాటిని కొనుగోలు చేయకూడదు అలాగే పెళ్లి వంటి శుభకార్యాలను కూడా చేయకూడదనీ పండితులు చెబుతున్నారు.
Ananya Nagalla: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం "లీసా". వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
This website uses cookies.