Devotional Tips: సాధారణంగా ఇంట్లో కనుక మరణం సంభవిస్తే ఆ ఇంట్లోని వారు ఏడాది పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకూడదని గుళ్ళకు వెళ్లకూడదని చాలామంది భావిస్తూ ఉంటారు. ఏడాది పూర్తి అయిన తర్వాత తిరిగి ఇంట్లో యధావిధిగా పూజలు చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి శుభకార్యాలైన చేసుకోవచ్చని చాలామంది చెబుతున్నారు. మరి నిజంగానే ఇంట్లో మరణం సంభవించిన తర్వాత ఏడాది పాటు పూజలు చేయకూడదా శాస్త్రం ఏం చెబుతుందనే విషయానికి వస్తే..
శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే మరణం సంభవించుంటుందో ఆ ఇంట్లో 11 రోజులపాటు ఎలాంటి పూజా కార్యక్రమాలను కానీ దీపం కానీ వెలిగించకూడదు. అయితే 11వ దినం పూర్తయిన తర్వాత 12వ రోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఆ రోజు నుంచి యధావిధిగా ఆ ఇంట్లో పూజ కార్యక్రమాలను చేయవచ్చని పండితులు చెబుతున్నారు. దీపం ఏ ఇంట్లో అయితే వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలవై ఉంటారని భావిస్తారు. అందుకే మరణం సంభవించిన ఇంట్లో కూడా 11 రోజుల తర్వాత దీపం వెలిగించుకోవడం శుభమని పండితులు చెబుతున్నారు.
ఇక చాలామంది ఏడాది పాటు దీపం చేయకూడదని పూజ సామాగ్రిని దేవుడి ఫోటోలను కూడా భద్రంగా దాచి పెట్టి ఉంటారు అలా చేయడం మంచిది కాదు.ఇలా ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవచ్చు గుడికి కూడా వెళ్ళవచ్చు కానీ హోమం యాగం వంటి వాటిని చేయకూడదు అలాగే నూతన గృహప్రవేశం చేయటం కొత్త కారు ,భూమి వంటి వాటిని కొనుగోలు చేయకూడదు అలాగే పెళ్లి వంటి శుభకార్యాలను కూడా చేయకూడదనీ పండితులు చెబుతున్నారు.
Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
This website uses cookies.