Devotional Tips: సాధారణంగా ఇంట్లో కనుక మరణం సంభవిస్తే ఆ ఇంట్లోని వారు ఏడాది పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకూడదని గుళ్ళకు వెళ్లకూడదని చాలామంది భావిస్తూ ఉంటారు. ఏడాది పూర్తి అయిన తర్వాత తిరిగి ఇంట్లో యధావిధిగా పూజలు చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి శుభకార్యాలైన చేసుకోవచ్చని చాలామంది చెబుతున్నారు. మరి నిజంగానే ఇంట్లో మరణం సంభవించిన తర్వాత ఏడాది పాటు పూజలు చేయకూడదా శాస్త్రం ఏం చెబుతుందనే విషయానికి వస్తే..
శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే మరణం సంభవించుంటుందో ఆ ఇంట్లో 11 రోజులపాటు ఎలాంటి పూజా కార్యక్రమాలను కానీ దీపం కానీ వెలిగించకూడదు. అయితే 11వ దినం పూర్తయిన తర్వాత 12వ రోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఆ రోజు నుంచి యధావిధిగా ఆ ఇంట్లో పూజ కార్యక్రమాలను చేయవచ్చని పండితులు చెబుతున్నారు. దీపం ఏ ఇంట్లో అయితే వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలవై ఉంటారని భావిస్తారు. అందుకే మరణం సంభవించిన ఇంట్లో కూడా 11 రోజుల తర్వాత దీపం వెలిగించుకోవడం శుభమని పండితులు చెబుతున్నారు.
ఇక చాలామంది ఏడాది పాటు దీపం చేయకూడదని పూజ సామాగ్రిని దేవుడి ఫోటోలను కూడా భద్రంగా దాచి పెట్టి ఉంటారు అలా చేయడం మంచిది కాదు.ఇలా ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవచ్చు గుడికి కూడా వెళ్ళవచ్చు కానీ హోమం యాగం వంటి వాటిని చేయకూడదు అలాగే నూతన గృహప్రవేశం చేయటం కొత్త కారు ,భూమి వంటి వాటిని కొనుగోలు చేయకూడదు అలాగే పెళ్లి వంటి శుభకార్యాలను కూడా చేయకూడదనీ పండితులు చెబుతున్నారు.
Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…
Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
This website uses cookies.