Devotional Tips: సాధారణంగా ఇంట్లో కనుక మరణం సంభవిస్తే ఆ ఇంట్లోని వారు ఏడాది పాటు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకూడదని గుళ్ళకు వెళ్లకూడదని చాలామంది భావిస్తూ ఉంటారు. ఏడాది పూర్తి అయిన తర్వాత తిరిగి ఇంట్లో యధావిధిగా పూజలు చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి శుభకార్యాలైన చేసుకోవచ్చని చాలామంది చెబుతున్నారు. మరి నిజంగానే ఇంట్లో మరణం సంభవించిన తర్వాత ఏడాది పాటు పూజలు చేయకూడదా శాస్త్రం ఏం చెబుతుందనే విషయానికి వస్తే..
శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే మరణం సంభవించుంటుందో ఆ ఇంట్లో 11 రోజులపాటు ఎలాంటి పూజా కార్యక్రమాలను కానీ దీపం కానీ వెలిగించకూడదు. అయితే 11వ దినం పూర్తయిన తర్వాత 12వ రోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఆ రోజు నుంచి యధావిధిగా ఆ ఇంట్లో పూజ కార్యక్రమాలను చేయవచ్చని పండితులు చెబుతున్నారు. దీపం ఏ ఇంట్లో అయితే వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలవై ఉంటారని భావిస్తారు. అందుకే మరణం సంభవించిన ఇంట్లో కూడా 11 రోజుల తర్వాత దీపం వెలిగించుకోవడం శుభమని పండితులు చెబుతున్నారు.
ఇక చాలామంది ఏడాది పాటు దీపం చేయకూడదని పూజ సామాగ్రిని దేవుడి ఫోటోలను కూడా భద్రంగా దాచి పెట్టి ఉంటారు అలా చేయడం మంచిది కాదు.ఇలా ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవచ్చు గుడికి కూడా వెళ్ళవచ్చు కానీ హోమం యాగం వంటి వాటిని చేయకూడదు అలాగే నూతన గృహప్రవేశం చేయటం కొత్త కారు ,భూమి వంటి వాటిని కొనుగోలు చేయకూడదు అలాగే పెళ్లి వంటి శుభకార్యాలను కూడా చేయకూడదనీ పండితులు చెబుతున్నారు.
Water Bottle: సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తుంటాము. అది ఎండాకాలమైనా లేదా వర్షాకాలమైనా…
Bhaumvati Amavasya 2026: ప్రతినెల మనకు అమావాస్య వస్తుంది అయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను బౌమతి అమావాస్య లేదా…
Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…
Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…
AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…
Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…
This website uses cookies.