Devotional Tips: సాధారణంగా మన జాతకంలో ఎన్నో దోషాలు ఉంటాయి ఇలా దోషాలు ఉన్న సమయంలో మనం ఏ పని చేసిన అది జరగదు అలాంటి సమయంలో చాలా మంది దోష పరిహారాలు చేస్తూ ఉంటారు. జాతక దోష తొలగిపోవాలంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఎనిమిది శనివారాలు ఇలా కనక చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అయితే మహిళలు ఈ దోష పరిహారైనా చేసే సమయంలో వారికి ఏదైనా అడ్డంకులు ఏర్పడిన ఆ వారం వదిలేసి మరుసటి వారాన్ని కూడా లెక్కపెట్టుకొని చేయవచ్చు.
మరి జాతక దోష పరిహారం కోసం ఏం చేయాలి అనే విషయానికి వస్తే…శనివారం సూర్యోదయానికి ముందు నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక స్వామివారి ముందు దీపం వెలిగించడం కోసం బియ్యపు పిండి, చిన్న బెల్లం ముక్క పాలు అరటి ముక్కలు వేసి ఆ పిండిని బాగా కలిపి ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఇలా ప్రమిద తయారు చేసుకున్న తర్వాత ఈ ప్రమిదలోకి నువ్వుల నూనె వేసి ఏడు వత్తులు వేసి తొలగించాలి.
ఇలా ఏడువత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఈ విధంగా 8 శనివారాలు పాటు ఈ విధమైనటువంటి పూజ చేయడం వల్ల మన జాతకంలో ఏ విధమైనటువంటి దోషాలు ఉన్న తొలగిపోతాయి. అలాగే మనం అనుకున్న పనులు నెరవేరుతాయి.మన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
Fast Food: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతుంటారు. బయటకు వెళ్తే పిజ్జా, బర్గర్,…
Tuesday Auspiciousness: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కొత్త పనులను ప్రారంభించాలి అంటే సరైన వారం, తేదీ, తిథి…
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
This website uses cookies.