News: ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద ఆహారాన్ని వండేవారు. దీనికోసం ఎండిపోయిన కలపను ఉపయోగించి ఆరు బయట పొయ్యిలు ఏర్పాటు చేసి వంటలు చేసేవారు. ఉమ్మడి కుటుంబాలు అయినా కూడా ఇంట్లో అందరికీ ఆ కట్టెల పొయ్యి మీద మాత్రమే వంట చేసేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు దైనందిన జీవితంలో ప్రజల జీవన స్థితిగతులు కూడా పూర్తిగా మారిపోయింది. ఈ కాలంలో కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవారు చాలా తగ్గిపోయారని చెప్పాలి. గ్రామీణ ప్రాంతాలలో కూడా 10 నుంచి 20 శాతం మంది మాత్రమే కట్టెల పోయ్యిని వంట చేయడం కోసం ఈ రోజుల్లో ఉపయోగిస్తున్నారు.
మెజారిటీ ప్రజలు వంట కోసం గ్యాస్ ని వినియోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సిటీలలో అయితే పూర్తిగా గ్యాస్ మీదనే వంటల కోసం ఆధారపడతారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్లో ఉండే వాయువులు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అంటున్నారు. ఇంటర్నల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం అమెరికాలో 13 శాతం మంది చిన్నారులు గ్యాస్ స్టవ్ ఉధ్గారాల కారణంగా ఆస్తమా బారిన పడుతున్నారు. గ్యాస్ స్టవ్ మండుతున్న సమయంలో వెలువడే వాయువులు పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.