News: ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి మీద ఆహారాన్ని వండేవారు. దీనికోసం ఎండిపోయిన కలపను ఉపయోగించి ఆరు బయట పొయ్యిలు ఏర్పాటు చేసి వంటలు చేసేవారు. ఉమ్మడి కుటుంబాలు అయినా కూడా ఇంట్లో అందరికీ ఆ కట్టెల పొయ్యి మీద మాత్రమే వంట చేసేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు దైనందిన జీవితంలో ప్రజల జీవన స్థితిగతులు కూడా పూర్తిగా మారిపోయింది. ఈ కాలంలో కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవారు చాలా తగ్గిపోయారని చెప్పాలి. గ్రామీణ ప్రాంతాలలో కూడా 10 నుంచి 20 శాతం మంది మాత్రమే కట్టెల పోయ్యిని వంట చేయడం కోసం ఈ రోజుల్లో ఉపయోగిస్తున్నారు.
మెజారిటీ ప్రజలు వంట కోసం గ్యాస్ ని వినియోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సిటీలలో అయితే పూర్తిగా గ్యాస్ మీదనే వంటల కోసం ఆధారపడతారు. అయితే ఈ గ్యాస్ సిలిండర్లో ఉండే వాయువులు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అంటున్నారు. ఇంటర్నల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం అమెరికాలో 13 శాతం మంది చిన్నారులు గ్యాస్ స్టవ్ ఉధ్గారాల కారణంగా ఆస్తమా బారిన పడుతున్నారు. గ్యాస్ స్టవ్ మండుతున్న సమయంలో వెలువడే వాయువులు పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Politics: రెండు వేర్వేరు రాష్ట్రాలు.. ఇద్దరు భిన్నమైన నేతలు. కానీ, ప్రస్తుతం వారు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహం మాత్రం 'సేమ్…
Tollywood: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' థియేటర్లలోకి వచ్చి రావడం…
AP POLITICS: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తదుపరి అడుగు ఎటువైపు అనే చర్చ…
Banyan Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం కొన్ని వృక్షాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాంటి వాటిలో మర్రిచెట్టు కూడా…
International Yoga Day 2026: ప్రతి ఏడాది జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకుంటారు. ఇక…
Puranapanda Srinivas: హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా…
This website uses cookies.