Categories: LatestMovies

Chiranjeevi : హనుమంతుడే నన్ను పిలిచాడు..అయోధ్యకు రావడం నా అదృష్టం

Chiranjeevi : దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఘట్టం మరికొద్ద గంటల్లో ప్రారంభం కానుంది. ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం కోట్లాది కళ్లు కన్న కలలు ఇవాళ్టితో నెరవేరనున్నాయి. అయోధ్య రామ మందిరంలో ఇవాళ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరగనుంది. దేశంలోనే గొప్ప కార్యక్రమంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో భారతదేశం మొత్తం శ్రీరాముని భక్తులు సంబరాలు చేసుకుంటున్నారు. జై శ్రీరాం నామస్మరణతో కొత్త సందడిగా మారింది. వీధులన్నీ హనుమయ్య విగ్రహాలు, రామును గీతాలాపనతో ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఈ అద్భుతమైన ఘట్టాన్ని కన్నులారా చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సెలెబ్రిటీలు అయోధ్యకు చేరుకుంటున్నారు. లేటెస్టుగా మెగాస్టార్ చిరంజీవి అయోధ్యకు చేరుకున్నారు. మెగాస్టార్ తో పాటు ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసనలు అయోధ్యకు వచ్చారు. ఈ క్రమంలో జాతీయ మీడియా ముందు చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

chiranjeevi-reached-ayodhya-ram-mandir-pran-pratishtha-event-with-family

అయోధ్య రామ మందిరంలో ఘనంగా జరిగే బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలను కేంద్రం పిలుపించింది. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన ప్రముఖలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఇందులో కొంతమందికి కేంద్ర సర్కార్ పెద్దలు ప్రత్యేక చొరవ తీసుకుని మరీ ఆహ్వాన పత్రికలను పంపించిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవికి ఆయన కుంటుంబ సభ్యులకు అయోధ్య రామ మందిరంలో జరగనున్న బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఆయనతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన మరికొంత మంది సెలబ్రిటీలను కూడా పిలిచింది. రామ్ చరణ్, మోహన్ బాబు, ప్రభాస్ సహా చాలా మంది పేర్లు ఆహ్వాన లిస్టులో ఉన్నాయి. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఆయన కటుంబసభ్యులతో సహా ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు

chiranjeevi-reached-ayodhya-ram-mandir-pran-pratishtha-event-with-family

ఈ సందర్భంగా జాతీయ మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ..” దేశంలో జరిగే ఈ మహోన్నత కార్యక్రమానికి ఆహ్వానం అందండం చాలా గర్వంగా ఉంది. 500 సంవత్సరాలకుపైగా యావత్ దేశం మొత్తం కన్న కల ఇవాళ ఎట్టకేలకు నెరవేరబోతుంది. ఈ అద్భుతమైన దైవ కార్యక్రమానికి కుటుంబంతో సహా నేను రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి దైవకార్యానికి పూనుకున్న కేంద్ర సర్కార్ చొరవ ఎంతో గొప్పది కొన్ని కోట్ల మంది భారతీయుల కోరికను కేంద్రం, ప్రధాని మోదీ గారు ఇవాళ నిజం చేయబోతున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని దగ్గరుండి చూడటం నా అదృష్టం. నేను హనుమంతుడి భక్తుడిని, ఆయన నాకు ఇష్టదైవం. ఆయనే ఈ దైవకార్యానికి నన్ను పిలిచాడు. ఈ నిమిషాన్ని నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను”. అని చిరంజీవి తెలిపారు.

Sri Aruna Sri

Recent Posts

saliva onSleeping: నిద్రపోతున్నప్పుడు నోటి నుంచి లాలాజలం వస్తుందా? అశ్రద్ధ చెయ్యొద్దు?

saliva on Sleeping:  సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో నోటి నుంచి మనకు తెలియకుండానే లాలాజలం వస్తుంటుంది. ఇలా లాలాజలం కారణంగా…

12 hours ago

Tirumala SSD Tokens: శ్రీవారి భక్తులు అలర్ట్.. SSD దర్శన టోకెన్లు రద్దు చేసిన టీటీడీ..

Tirumala SSD Tokens: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల తిరుమల చేరుకుంటున్నారు.…

13 hours ago

AP NEWS: బాలినేని శ్రీనివాస రెడ్డి ఆపరేషన్ సక్సెస్.. వైసీపీలో ప్రకంపనలు.!

AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…

2 days ago

Chandrababu: జొన్నగిరి బంగారం.. అప్పుడే మార్కెట్‌లోకి వ‌చ్చేసిందా..?

Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…

3 days ago

Tollywood: ఒకేసారి 3 సినిమాలతో మ‌హేష్‌.. ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌..!

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్‌లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…

3 days ago

Jamun Fruits: నేరేడు పండ్లను తినకుండా పక్కన పెడుతున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!

Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…

3 days ago

This website uses cookies.