Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచారు. పవన్ గెలుపు కోసం ఎన్డీయే కూటమితో పాటు మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగింది. అన్న నాగబాబుతో పాటు మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే ప్రచారంలో స్పీడ్ పెంచారు. తాజాగా తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. పవన్ ను గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు మెగాస్టార్.
వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ..” అమ్మ కడుపున చివరన పుట్టినా అందరికీ మేలు చేసే విషయంలో పవన్ ఎప్పుడూ ముందుంటాడు. తనకంటే జనం గురించే పవన్ ఎప్పుడూ ఆలోచిస్తాడు. చాలా మంది అధికారంలోకి వచ్చాకే ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటారు . కానీ నా తమ్ముడు కష్టపడి సంపాదించి కూడబెట్టిన తన సొంత ఆస్తిని కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు వాడతాడు, బార్డర్లలో పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం విరాలం అందిస్తాడు. మత్స్యకారులకు సాయం చేస్తాడు. పవన్ చేస్తే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాలని అనిపిస్తోంది. ఏ తల్లికైనా కొడుకు కష్టపడుతుంటే గుండె బరువెక్కుతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు అవస్థలు పడుతుంటే బాధగా ఉంటుంది.
నా తల్లికి ఒక మాట చెప్పా. నీ కొడుకు ఎంతో మంది తల్లులు, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం యుద్ధం చేస్తున్నాడు అని చెప్పాను. మనం పడుతున్న బాధ కంటే అది ఎంతో గొప్పది. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టం. అది నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు నా తమ్ముడు. తన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయానికి అంకితం చేశాడు. రాష్ట్ర భవిష్యత్తు కోసం శక్తిని వినియోగించాలి అంటే చట్టసభల్లో తమ్ముడి గొంతును మనం వినాలి. తమ్ముడు ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు కల్యాణ్ను గెలిపించాలి. మీకు సేవకుడిగా, సైనికుడిగా, అన్నయ్యగా అండగా నిలబడతాడు. మీ కలను నిజం చేస్తాడు”అని చిరంజీవి భావోద్వేగమైన వీడియో చేశారు.
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.…
This website uses cookies.