Chandrababu Naidu: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసిపి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య తారాస్థాయిలో రాజకీయ పోరు నడుస్తూ ఉంది. ఇక తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదిగి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న నాయకులే ముఖ్యంగా చంద్రబాబు నారా లోకేశ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండడం విశేషం. కొడాలి నాని, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ ముగ్గురు కూడా టిడిపి నుంచి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు.
ఇప్పుడు వారు చంద్రబాబుకి బద్ధ శత్రువులుగా మారిపోయారు. నిత్యం ఏదో ఒక అంశంపై చంద్రబాబు నారా లోకేష్ పై మీరు తీవ్రస్థాయిలో దూషణల కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని అయితే చంద్రబాబు నాయుడుకి పెద్ద తలనొప్పిగా మారారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలో ఉన్న గన్నవరం నియోజకవర్గ ఇప్పుడు కొడాలి నాని కారణంగా వైసిపి చేతుల్లోకి వెళ్లిపోయింది.
అయితే తిరిగి అక్కడ పునర్వైభవాన్ని తీసుకురావాలని, వచ్చే ఎన్నికల్లో గెలవాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు. గుడివాడ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ పర్యటనలోనే గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉందని మాట వినిపిస్తూ ఉంది. రానున్న ఎన్నికల్లో కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ఆదిశగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం అయితే కొడాలి మాత్రం తెలుగుదేశం పార్టీ తనను ఓడించలేదంటూ ధీమాగా ఉన్నారు. ప్రజలలోకి బలంగా వెళ్లిపోయిన కొడాలి నానిని ఓడించాలంటే కచ్చితంగా బలమైన వ్యూహాలను చంద్రబాబు సిద్ధం చేసుకోవాల్సిందే.
మరి ఈ సమయంలో బాబు ఎలాంటి అడుగులు వేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు వచ్చే ఎన్నికలలో భారీగా సీట్లు సొంతం చేసుకొని అధికారంలోకి రావాలని చంద్రబాబు గట్టిగా కసరత్తు చేస్తున్నారు. దీనికోసం వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వెళ్తున్నారు. జనసేన తమతో కలిసి వస్తుందని చంద్రబాబు ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి వాయిస్ ఎక్కువగా ఉంటే తర్వాత తెలుగుదేశం పార్టీని డామినేట్ చేసే అవకాశం ఉందని ముందుగానే బలమైన వ్యూహాలతో బాబు రాజకీయాలు చేస్తూ ఉండడం విశేషం.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.