Categories: LatestNewsPolitics

TDP: స్పీడ్ పెంచిన చంద్రబాబు

TDP: ఏపీ రాజకీయాలలో ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలలో ఎలా అయిన గెలవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. చంద్రబాబు రాజకీయ చాణిక్యంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజలని తనవైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక నుంచి, ప్రభుత్వం వ్యతిరేకత పెంచడంలో కొత్త పంథా ఫాలో అవుతున్నారు. జోనల్ సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎన్నికల ముందు మరల అభ్యర్ధులని ఎంపిక చేస్తే వారు జనంలోకి వెళ్ళడం కష్టం అవుతుందని ముందుగానే డిసైడ్ చేసి వారిని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడాలని సూచిస్తున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లాలో జోనల్ సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు కర్నూల్, నంద్యాల నియోజకవర్గాలలో 11 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులని ఖరారు చేశారు. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్ధులని ప్రకటించడమే కాకుండా వారికి బాధ్యతలు కూడా అప్పగించి ప్రజలలోకి వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉంటే మరో వైపు ప్రచార వ్యూహాలలో కూడా కొత్త పంథా ఎంచుకుంటున్నారు. గంజా వద్దు బ్రో అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రజలలోకి వెళ్లి గంజాయి నిర్మూలనపై చైతన్యం చేస్తున్నారు.

 

అలాగే టిడ్కో ఇళ్ళని ఇంకా లబ్ది దారులకి ఇవ్వలేదని చూపిస్తూ సెల్ఫీ చాలెంజ్ టూ జగన్ అంటూ కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని టిడ్కో ఇళ్ళ దగ్గర టీడీపీ నాయకులు సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్యాంపెయిన్ తో ప్రభుత్వం లబ్ది దారులకి ఇళ్ళు ఇవ్వడం లేదని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రానున్న ఎన్నికలలో కుప్పం నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని, దమ్ముంటే ఆపుకోవాలంటే జగన్ కి చాలెంజ్ విసిరారు. ఇలా అన్ని అంశాలలో స్పీడ్ చూపిస్తూ ప్రజాక్షేత్రంలోని తన అనుభవం, రాజకీయ చాణిక్యం చూపిస్తున్నారు.

Varalakshmi

Recent Posts

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

46 minutes ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

11 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

18 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

1 day ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

2 days ago

Andhra Pradesh: జగన్ షాకింగ్ డెసిషన్.. వైసీపీ నేత‌ల్లో గుబులు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…

3 days ago

This website uses cookies.