Burning Feet: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చాలామందికి అరికాళ్ళలో మంట ఏర్పడుతూ నడవడానికి కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇలా అరికాళ్ళ మంటల సమస్యతో బాధపడేవారు ఎన్నో రకాల మందులను వాడిన కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు అలాంటి వారు ఈ చిన్న చిట్కాలను కనుక పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
అరికాళ్ళలో మంటలు ఏర్పడేవారిలో రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బ తినటం వల్ల ఇలా మంటలు ఏర్పడుతుంటాయి. అలాగే విటమిన్ బి12 లోపం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో కాళ్ళను సుమారు ఆరు నిమిషాల పాటు పెట్టాలి. అనంతరం మరో నాలుగు నిమిషాలు చల్లనీటి గిన్నెలోకి కాళ్ళను పెట్టాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి.
ఈ విధంగా చేయడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.అదేవిధంగా గుమ్మడికాయ మిశ్రమంతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. గుమ్మడికాయ మిశ్రమాన్ని అరికాళ్ళకు రాసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి వేడి నీటితో కాళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు చేయటం వల్ల ఈ అరికాళ్ళ నొప్పులు మంట సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. ఈ చిట్కాలతో మీ సమస్యను దూరం చేసుకుని ఏ ఇబ్బంది లేకుండా నడవవచ్చు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.