Janasena-BJP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల లక్ష్యంగా అన్ని పార్టీలు ఎవరికి వారుగా ప్రణాళికలు చేసుకుంటున్నారు. గెలుపు వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రజాక్షేత్రంలోకి ఇప్పటికీ అధికార పార్టీ వైసిపి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు వెళ్లిపోయాయి. ఇంకా మూడవ ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీ మాత్రం పొత్తుల వ్యూహాలతో, కమలంతో కుస్తీలు పడుతూ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓవైపు వరుసగా సినిమా షూటింగ్ లు పెట్టుకుని బిజీగా ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారంలో భాగస్వామ్యం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే తమతో పొత్తులో ఉన్న బిజెపి పార్టీని కూడా వెంట తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. గత నెలలో ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు.
అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దృష్టి మొత్తం కర్ణాటక ఎన్నికలపై ఉంది. ఈసారి కర్ణాటక ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. దానికోసం ఉన్న అన్ని మార్గాలను వెతుకుతోంది. ఇప్పటికే కన్నడ స్టార్ సుదీప్ భారత జనతా పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయడానికి ఒప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్న నేపథ్యంలో అతనిని కూడా కర్ణాటక ఎన్నికలలో స్టార్ క్యాంపైనర్ గా ఉపయోగించుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో బిజెపి యువ నాయకుడుగా ఉన్న తేజస్వీ సూర్య పవన్ కళ్యాణ్ తో కలిసి దీనిపై మంతనాలు చేయడం జరిగిందని సమాచారం.
ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కేంద్రంలోని పెద్దలతో చర్చించడం కూడా జరిగింది. 2014 కాంబినేషన్ రిపీట్ చేద్దామని పవన్ కళ్యాణ్ వారిని కోరినట్లుగా టాక్. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ చేద్దామని వారు సూచించినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. పొత్తుల పైన కూడా అప్పుడు నిర్ణయాలు తీసుకుందామంటూ దాటవేశారంట. అలాగే కర్ణాటక ఎన్నికలలో బిజెపి తరఫున ప్రచారం చేయాలని కోరినట్లుగా సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం బిజెపి పెద్దలకు చెప్పలేదని తెలుస్తోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కర్ణాటక ఎన్నికలలో ప్రచారం చేయడం ద్వారా అధికారంలోకి వస్తే అప్పుడు ఏపీలో బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ సూచించిన దారిలో పెళ్లి అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది వేచి చూడాలి.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.