Mahaa Shiva Raatri: మరో రెండు రోజుల్లో మహా శివరాత్రి పర్వదినం రాబోతుంది. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినం గురించి మహర్షులు, పండితులు చెబుతూ ఉంటారు. ఇక ఈ రోజున దేశ వ్యాప్తంగా ఉన్న శైవ ఆలయాలు అన్ని కూడా భక్తులతో కిక్కిరిసి పోతాయి. కోట్లాది మంది భక్తులు శివాలయాలకి వెళ్లి ఆ ముక్కంటిని పూజిస్తారు. అదే సమయంలో ఆ రోజు ఉపవాసాలు ఉంటారు. అలాగే రాత్రి జాగరణ చేసి ఉదయాన్నే సంధ్యాస్నానం చేసి మరల శివాలయానికి వెళ్లి ముక్కంటిని ఆరాధిస్తారు. ఇలా చేయడం వలన జీవితంలో చేసిన సకల పాపాలు హరిస్తాయని హిందువుల విశ్వాసం.
హేతువాదులు దీనిని మూఢ నమ్మకంగా కొట్టిపారేసిన మన ఆద్యాత్మిక ప్రపంచంలో ఆచరించే ప్రతి ప్రక్రియ వెనుక ఒక బలమైన కారణం ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఆ నమ్మకంతోనే మహాశివరాత్రి రోజున శివయ్యని భక్తితో ఆరాధిస్తారు. ఇదిలా ఉంటే మహాశివరాత్రి రోజున శివయ్యని ఆరాధించడంలో ఎంత నిష్టతో ప్రజలు ఉంటారో కొన్ని చేయకూడని పనులు విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. శివరాత్రి రోజున గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఆహారాలకు దూరంగా ఉండటం వలన ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
అలాగే మాంసంహారానికి అస్సలు ముట్టుకోకూడదు. ఉల్లి, వెల్లుల్లి కూడా ఆ రోజు వండుకునే పదార్ధాలలో ఉండకుండా చూసుకోవాలి. అలాగే మాదకద్రవ్యాలకి, మత్తుని కలిగించే పొగాకు, మధ్యాన్ని ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకూడదు. ఈ నియమాలని తప్పడం అంటే మహాశివుడికి అపచారం చేసినట్లే అని పండితులు చెప్పే మాట. అలాగే శివయ్యకి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయకూడదు. కేతకి పువ్వులని కూడా సమర్పించకూడదు.
నలుపు రంగు దుస్తులకి దూరంగా ఉండాలి. తులసి ఆకులని శివయ్యకి దండగా వేయకూడదు. అలాగే బ్రహ్మ ముహూర్తంలో శివరాత్రి పర్వదినం రోజున నిద్ర లేచి స్నానం ఆచరించి మహాశివుడి ఆలయానికి వెళ్లి ముక్కంటిని దర్శించుకుంటే మంచిది. అలాగే ఉపవాస, జాగరణ చేసే వారు ముందుగానే తమ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చూసుకొని వాటిని పాటించాలి. లేదంటే శారీరకంగా ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.