Food: సాధారణంగా చాలామంది వేడివేడి అన్నం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది చల్లగా అయిన ఆహారాన్ని కూడా వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఇలా వేడి చేసుకుని తినడం వల్ల ఆహారం తాజాగా అవుతుందని భావిస్తూ ఉంటారు కానీ నిజానికి మాటిమాటికి ఆహారాన్ని వేడి చేసుకుని తినటం ప్రమాదాలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ ఆహారం వేడి చేయటం వల్ల ఎలాంటి ప్రమాదాలు తలెత్తుతాయి అనే విషయానికి వస్తే…
అమెరికన్ జర్నల్ ఆఫ్ బయోమెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ అనేది మనం తినే ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి. ముఖ్యంగా వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సమయం ఉంచినప్పుడు దానిపై బాసిల్లాస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా ఆహారంపై విషాన్ని వెదజల్లుతుంది. కాబట్టి ఆ ఫుడ్ కలుషితం అవుతుంది.
ఈ విధంగా కలుషితమైన ఆహారాన్ని తినటం వల్ల మనకు ఫుడ్ పాయిజన్ అయి వాంతులు విరోచనాలు తల తిరగడం వంటివి మొదలవుతాయి.ఈ పరిస్థితినే ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్గా పేర్కొంటారు. నిర్లక్ష్యం చేస్తే మరణం కూడా సంభవించవచ్చు. సాధారణంగా అన్నం, పాస్తా, నూడుల్స్, మాంసం, కూరగాయలు, స్వీట్లు వంటి పదార్థాలను గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచడం వల్ల ఇక బాసిల్లాస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే గది ఉష్ణోగ్రత వద్ద ఆహారం చల్లబడిన తినడం మంచిది కానీ వేడి చేసుకుని తింటే ప్రమాదం తప్పదని సూచిస్తున్నారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.