Food: సాధారణంగా చాలామంది వేడివేడి అన్నం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొంతమంది చల్లగా అయిన ఆహారాన్ని కూడా వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఇలా వేడి చేసుకుని తినడం వల్ల ఆహారం తాజాగా అవుతుందని భావిస్తూ ఉంటారు కానీ నిజానికి మాటిమాటికి ఆహారాన్ని వేడి చేసుకుని తినటం ప్రమాదాలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ ఆహారం వేడి చేయటం వల్ల ఎలాంటి ప్రమాదాలు తలెత్తుతాయి అనే విషయానికి వస్తే…
అమెరికన్ జర్నల్ ఆఫ్ బయోమెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం.. ‘ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్’ అనేది మనం తినే ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధి. ముఖ్యంగా వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సమయం ఉంచినప్పుడు దానిపై బాసిల్లాస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా ఆహారంపై విషాన్ని వెదజల్లుతుంది. కాబట్టి ఆ ఫుడ్ కలుషితం అవుతుంది.
ఈ విధంగా కలుషితమైన ఆహారాన్ని తినటం వల్ల మనకు ఫుడ్ పాయిజన్ అయి వాంతులు విరోచనాలు తల తిరగడం వంటివి మొదలవుతాయి.ఈ పరిస్థితినే ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్గా పేర్కొంటారు. నిర్లక్ష్యం చేస్తే మరణం కూడా సంభవించవచ్చు. సాధారణంగా అన్నం, పాస్తా, నూడుల్స్, మాంసం, కూరగాయలు, స్వీట్లు వంటి పదార్థాలను గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచడం వల్ల ఇక బాసిల్లాస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే గది ఉష్ణోగ్రత వద్ద ఆహారం చల్లబడిన తినడం మంచిది కానీ వేడి చేసుకుని తింటే ప్రమాదం తప్పదని సూచిస్తున్నారు.
Dil Raju: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్లో ఓ సినిమా…
Pawan Kalyan-Suswagatham: సౌందర్య..ఈ పేరు వింటే చాలు ప్రతీ ఒక్కరికీ ఆమె నటించిన అద్భుతమైన సినిమాలు కళ్ళ ముందు అలా…
Ananya Nagalla: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం "లీసా". వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
This website uses cookies.