AP POLITICS: దేశవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం సమర శంఖం పూరించింది. జూన్, జూలై నెలల్లో వివిధ రాష్ట్రాల నుంచి ఖాళీ అవుతున్న స్థానాలను భర్తీ చేసేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నాలుగు కీలక స్థానాలు కూడా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారబోతున్నాయి.
ఈ మెగా ఎన్నికలకు జూన్ 1వ తేదీన అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక జూన్ 18వ తేదీన ఉదయం నుంచి పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించేందుకు ఎన్నికల సంఘం పక్కా ప్లాన్తో సిద్ధమైంది. ఏపీ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అలాగే పరిమల్ నత్వానీ, సానా సతీష్ బాబుల పదవీ కాలం ముగియనుండటంతో ఈ నాలుగు స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఈ సీట్లను దక్కించుకునేందుకు తెరవెనుక రాజకీయాలు అప్పుడే ఊపందుకున్నాయి.
మరోవైపు జాతీయ రాజకీయాల్లోనూ ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. కర్ణాటక నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ, అలాగే మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లాంటి దిగ్గజాల పదవీ కాలం ముగియనుంది. గుజరాత్లో 4, మధ్యప్రదేశ్లో 3, జార్ఖండ్లో 2, మణిపూర్లో ఒక స్థానానికి కూడా నోటిఫికేషన్ విడుదల కానుంది. బలబలాల పరంగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. జూన్ 18న తేలనున్న ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.