Anchor Anasuya: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తో సూపర్ సక్సెస్ అందుకొని గీతా గోవిందం మూవీతో స్టార్ స్టేటస్ ని విజయ్ దేవరకొండ సొంతం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ గత ఏడాది లైగర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి ఖుషి మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు ది విజయ్ దేవరకొండ అని ఉంది.
అర్జున్ రెడ్డి సినిమా నుంచి స్టార్ యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన అనసూయ, విజయ్ దేవరకొండతో గొడవ పడుతూనే ఉంది. ఆ సినిమా విషయంలో లైవ్ డిబేట్ లో కూడా పార్టిసిపేట్ చేసి విమర్శలు చేశారు. గతంలో చాలా సందర్భాల్లో విజయ్ దేవరకొండపై అనసూయ తన కోపాన్ని ప్రదర్శించారు. లైగర్ మూవీ ఫ్లాప్ అయినప్పుడు ట్విట్టర్ లో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఖుషి పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు విషయంలో అనసూయ ట్విట్టర్ లో విమర్శిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ది నాన్సెన్స్ ఇప్పుడే చూశా. ఇలాంటి పైత్యానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తా అంటూ పోస్ట్ చేశారు.
ఇలా విమర్శలు చేయడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆమెపై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. అనసూయని దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తనపై వచ్చిన విమర్శలకు ఆమె కూడా గట్టిగానే రియాక్ట్ కావడం విశేషం. ఇలా ఈరోజు ట్విట్టర్ లో అనసూయ వెర్షస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనే విధంగా రచ్చ నడుస్తూనే ఉంది. అనసూయ కావాలని రెచ్చగొట్టి వివాదం సృష్టించి అటెన్సన్ గ్రాబ్ చేసుకుంటుంది అనే విమర్శలు సోషల్ మీడియాలో దేవరకొండ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. మరి ఈ ట్విట్టర్ వార్ అనసూయ, రౌడీ స్టార్ ఫ్యాన్స్ మధ్య ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.