aadipurush-movies-changes-70-percentage-done
Aadipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో టి-సిరీస్ ఈ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి సంబందించిన టీజర్ గత ఏడాది రిలీజ్ చేశారు. అయితే ఆ టీజర్ ఎంతగా రీచ్ అయ్యిందో అంతే స్థాయిలో వివాదాస్పదంగా మారింది. రామాయణం కథని పూర్తిగా వక్రీకరించి ప్రెజెంట్ చేశారని. పాత్రల చిత్రణ మార్చేసారు అంటూ విమర్శలు వచ్చాయి. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శలు చేశారు.
ముఖ్యంగా కంటెంట్ విషయంలో క్యారెక్టర్స్ లుక్స్ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టి పరిస్థితిలో పాత్రల లుక్స్ అలాగే ఉంటే సినిమా రిలీజ్ కానివ్వం అంటూ హిందుత్వ సంస్థలు హెచ్చరించాయి. అనాదిగా మన హిందుత్వ పురాణాల ప్రాకారమ రామాయణం పాత్రల చిత్రణ ఎలా ఉందో అలాగే చూపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఓం రౌత్ సినిమా రిలీజ్ వాయిదా వేసి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ మీద వర్క్ స్టార్ట్ చేశారు.
సినిమాలో క్యారెక్టర్స్ లుక్స్ ని కూడా కొంత వరకు మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. కాస్తా నేటివిటీకి దగ్గరగా ఉండే విధంగా పాత్రల చిత్రణ చేస్తున్నారని బిటౌన్ లో వినిపిస్తున్న మాట. అయితే అయితే అందరూ డిమాండ్ చేసే స్థాయిలో కాకుండా కొంత వరకు ఆధునీకరించి ఒప్పించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. జూన్ 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. హాలీవుడ్ ఆడియన్స్ కి కూడా మన రామాయణం కథని రీచ్ చేయాలని కొంత ఆధునీకరించి పాత్రల చిత్రణని మార్చినట్లుగా గతంలో ఓం రౌత్ క్లారిటీ ఇచ్చారు.
AP POLITICS: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితేనే అసలు…
Film Updates: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం యుద్ధం జరగడం మామూలే. కానీ ఈ వారం రాబోతున్న రెండు…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి…
Film Updates: టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని, ప్రస్తుతం తన…
Cinema News: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను…
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తి పారవశ్యం చాటుకున్నారు.…
This website uses cookies.