aadipurush-movies-changes-70-percentage-done
Aadipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో టి-సిరీస్ ఈ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి సంబందించిన టీజర్ గత ఏడాది రిలీజ్ చేశారు. అయితే ఆ టీజర్ ఎంతగా రీచ్ అయ్యిందో అంతే స్థాయిలో వివాదాస్పదంగా మారింది. రామాయణం కథని పూర్తిగా వక్రీకరించి ప్రెజెంట్ చేశారని. పాత్రల చిత్రణ మార్చేసారు అంటూ విమర్శలు వచ్చాయి. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయంటూ విమర్శలు చేశారు.
ముఖ్యంగా కంటెంట్ విషయంలో క్యారెక్టర్స్ లుక్స్ విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టి పరిస్థితిలో పాత్రల లుక్స్ అలాగే ఉంటే సినిమా రిలీజ్ కానివ్వం అంటూ హిందుత్వ సంస్థలు హెచ్చరించాయి. అనాదిగా మన హిందుత్వ పురాణాల ప్రాకారమ రామాయణం పాత్రల చిత్రణ ఎలా ఉందో అలాగే చూపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఓం రౌత్ సినిమా రిలీజ్ వాయిదా వేసి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ మీద వర్క్ స్టార్ట్ చేశారు.
సినిమాలో క్యారెక్టర్స్ లుక్స్ ని కూడా కొంత వరకు మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. కాస్తా నేటివిటీకి దగ్గరగా ఉండే విధంగా పాత్రల చిత్రణ చేస్తున్నారని బిటౌన్ లో వినిపిస్తున్న మాట. అయితే అయితే అందరూ డిమాండ్ చేసే స్థాయిలో కాకుండా కొంత వరకు ఆధునీకరించి ఒప్పించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. జూన్ 16న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. హాలీవుడ్ ఆడియన్స్ కి కూడా మన రామాయణం కథని రీచ్ చేయాలని కొంత ఆధునీకరించి పాత్రల చిత్రణని మార్చినట్లుగా గతంలో ఓం రౌత్ క్లారిటీ ఇచ్చారు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.