Mangoes: సాధారణంగా వేసవి కాలంలో మనకు మామిడి పండ్లు చాలా విరివిగా లభిస్తాయి. వేసవి కాలం కోసం మామిడిపండ్ల ప్రియులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వేసవి కాలంలో మార్కెట్లోకి విరివిగా వచ్చే మామిడి పండ్లను చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు అయితే మామిడి పండ్లను స్మూతీ లాగా తయారు చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు మామిడిపండు తిన్న వెంటనే వేరే పండ్లను తినడం లేదంటే మామిడి పండ్లతో పాటు ఇతర పదార్థాలను కలుపుకొని తినడం వంటివి చేస్తుంటారు.
ఇలా మామిడి పండ్లతో పాటు పొరపాటున కూడా కొన్ని పనులను అలాగే కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మామిడిపండు తిన్న వెంటనే ఈ పదార్థాలను అస్సలు తినకూడదట మరి ఏ పదార్థాలను తినకూడదు ఏంటి అనే విషయానికి వస్తే.. చాలామంది మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగుతూ ఉంటారు. అలా పొరపాటున కూడా నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మామిడి పండు తిన్న తర్వాత నీళ్లు తాగటం వల్ల ఎసిడిటీ ఏర్పడటం అలాగే కడుపులో నొప్పి మంటగా ఉండటం జరుగుతుంది. ఇక మామిడి పండు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ కూడా తినకూడదు అలాగే స్పైసి ఆహార పదార్థాలను కూడా తినకూడదు ఇలా తినటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి అయితే చాలామంది కూల్ డ్రింక్స్ తాగిన వెంటనే కూడా మామిడిపండు తింటున్నారు. ఇది కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇక మామిడిపండు తిన్న వెంటనే కాకరకాయ కూడా తినకూడదు ఇలా తినడం వల్ల వాంతులు విరోచనాలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని దూరం పెట్టడం మంచిది.
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…
Health care: ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…
TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…
AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…
This website uses cookies.