Politics: ఇక పై ఎక్కడి నుంచైనా ఓట్లు వేసే అవకాశం ఉంటుందా?

Politics: ఎన్నికల సమయాలలో కొంత మంది దూర ప్రాంతాలలో ఉండి తమ ఓటుని వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికలలో తక్కువ ఓటింగ్ నమోదు కావడానికి ప్రధాన కారణం అక్కడి ప్రజలు జీవనోపాధి కోసం పట్టణాలకి వలస పోతారు. వారు ఎన్నికలకి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అలాగే ఉద్యోగాలు చేసే వారు కూడా దూర ప్రాంతాలలో ఉంటూ ఓట్లు వేయడానికి సొంతూరు వెళ్ళాలంటే ఖర్చులు లెక్కపెట్టుకొని వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ కారణంగా ఇండియాలో అసెంబ్లీ ఎన్నికలలో సరాసరి 60 నుంచి 70 శాతం మాత్రమే ఓట్లు నమోదు అవుతాయి. అయితే మిగిలిన 30 శాతం కూడా ప్రజలు ఓట్లు వినియోగించుకుంటే పోటీ చేసే నాయకుల భవిష్యత్తు మారిపోయే అవకాశం ఉంటుంది.

ఈ 60 శాతం పోలింగ్ లో కొంత మంది పదులు నుంచి వందల సంఖ్య ఓట్ల మార్జిన్ తో గెలుస్తారు. అయితే ఎన్నికలలో ఇకపై ఎక్కడి నుంచి అయినా ఓట్లు వేసుకునే విధంగా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మిషన్ ని ముందుగా ఐదు రాష్ట్రాలలో అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటుంది. ఇక జనవరి 16న ఈ కొత్త టెక్నాలజీ మిషన్ ని ప్రదర్శనకి ఉంచబోతున్నారు. ఇక ఈ మిషన్ పనితీరు, ప్రదర్శనని తిలకించడానికి అన్ని పార్టీలని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.

ఇక పార్టీల అభిప్రాయం మేరకు దీనిని ఫైనల్ స్టేజ్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక వేళ పార్టీలు ఏవైనా మార్పులు సూచిస్తే వాటికి అనుగుణంగా కూడా టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక పార్టీల అంగీకారంతో ఈ మిషన్ ని ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలోకి తీసుకొస్తామని తెలిపారు. దీని ద్వారా ఓటర్ ఎక్కడ ఉంటే అక్కడ పోలింగ్ బూత్ కి వెళ్లి రోమోట్ సిస్టమ్ తో తన నియోజకవర్గానికి సంబందించిన డేటాతో కనెక్ట్ అయ్యి నచ్చిన వారికి ఓటు వేసే సౌలభ్యం ఉంటుంది. ఇది విజయవంతం అయితే మాత్రం దేశంలో కచ్చితంగా ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడు ప్రజలు కూడా నిరంభ్యంతరంగా తమకి నచ్చిన అభ్యర్దులకి ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. అయితే టెక్నాలజీ కాబట్టి హ్యాకింగ్ తో ఏదో ఒక అభ్యర్ధికి అనుకూలంగా ఓట్లు పడే విధంగా మార్చుకునే ప్రమాదం కూడా ఉంటుందని భావిస్తున్నారు. అయితే సెన్సార్ మోనిటరింగ్ ద్వారా మరింత పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుందని తెలుస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

3 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

1 week ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

2 weeks ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.