Politics: ఇక పై ఎక్కడి నుంచైనా ఓట్లు వేసే అవకాశం ఉంటుందా?

Politics: ఎన్నికల సమయాలలో కొంత మంది దూర ప్రాంతాలలో ఉండి తమ ఓటుని వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికలలో తక్కువ ఓటింగ్ నమోదు కావడానికి ప్రధాన కారణం అక్కడి ప్రజలు జీవనోపాధి కోసం పట్టణాలకి వలస పోతారు. వారు ఎన్నికలకి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అలాగే ఉద్యోగాలు చేసే వారు కూడా దూర ప్రాంతాలలో ఉంటూ ఓట్లు వేయడానికి సొంతూరు వెళ్ళాలంటే ఖర్చులు లెక్కపెట్టుకొని వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ కారణంగా ఇండియాలో అసెంబ్లీ ఎన్నికలలో సరాసరి 60 నుంచి 70 శాతం మాత్రమే ఓట్లు నమోదు అవుతాయి. అయితే మిగిలిన 30 శాతం కూడా ప్రజలు ఓట్లు వినియోగించుకుంటే పోటీ చేసే నాయకుల భవిష్యత్తు మారిపోయే అవకాశం ఉంటుంది.

ఈ 60 శాతం పోలింగ్ లో కొంత మంది పదులు నుంచి వందల సంఖ్య ఓట్ల మార్జిన్ తో గెలుస్తారు. అయితే ఎన్నికలలో ఇకపై ఎక్కడి నుంచి అయినా ఓట్లు వేసుకునే విధంగా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మిషన్ ని ముందుగా ఐదు రాష్ట్రాలలో అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటుంది. ఇక జనవరి 16న ఈ కొత్త టెక్నాలజీ మిషన్ ని ప్రదర్శనకి ఉంచబోతున్నారు. ఇక ఈ మిషన్ పనితీరు, ప్రదర్శనని తిలకించడానికి అన్ని పార్టీలని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.

ఇక పార్టీల అభిప్రాయం మేరకు దీనిని ఫైనల్ స్టేజ్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక వేళ పార్టీలు ఏవైనా మార్పులు సూచిస్తే వాటికి అనుగుణంగా కూడా టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక పార్టీల అంగీకారంతో ఈ మిషన్ ని ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలోకి తీసుకొస్తామని తెలిపారు. దీని ద్వారా ఓటర్ ఎక్కడ ఉంటే అక్కడ పోలింగ్ బూత్ కి వెళ్లి రోమోట్ సిస్టమ్ తో తన నియోజకవర్గానికి సంబందించిన డేటాతో కనెక్ట్ అయ్యి నచ్చిన వారికి ఓటు వేసే సౌలభ్యం ఉంటుంది. ఇది విజయవంతం అయితే మాత్రం దేశంలో కచ్చితంగా ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అప్పుడు ప్రజలు కూడా నిరంభ్యంతరంగా తమకి నచ్చిన అభ్యర్దులకి ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది. అయితే టెక్నాలజీ కాబట్టి హ్యాకింగ్ తో ఏదో ఒక అభ్యర్ధికి అనుకూలంగా ఓట్లు పడే విధంగా మార్చుకునే ప్రమాదం కూడా ఉంటుందని భావిస్తున్నారు. అయితే సెన్సార్ మోనిటరింగ్ ద్వారా మరింత పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుందని తెలుస్తుంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.