Categories: LatestNewsPolitics

Yuvagalam: యువగళంపై ఎందుకంత అసహనం

Yuvagalam: నారా లోకేష్ యువగళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ మరల టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మహానాడు నేపథ్యంలో ఓ నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ యాత్రని ప్రారంభించారు. ఇక ప్రజల నుంచి ఈ యాత్రకి రోజురోజుకి స్పందన పెరుగుతోంది. ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపించకపోయిన ఇప్పుడిప్పుడే లోకేష్ యువగళంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ యాత్ర జరుగుతున్నా నియోజకవర్గాలలో స్థానిక వైసీపీ నాయకులు, నార్యకర్తలు విపరీతంగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉండటం విశేషం. తాజాగా ప్రొద్దుటూరులో ఈ యాత్ర కొనసాగుతోంది.

అయితే యాత్రని లక్ష్యంగా చేసుకొని వైసీపీ కార్యకర్తలు నారా లోకేష్ పై కోడిగుడ్లు విసిరారు. దీనిని సీరియస్ గా తీసుకొని టీడీపీ కార్యకర్తలు అందరూ అతనిపై దాడి చేశారు. అయితే ఈ ఘటనని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. యువగళం పాదయాత్రని చూసి వైసీపీ నాయకులు భరించలేకపోతున్నారు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయ వర్గాలలో కూడా ఇదే మాట వినిపిస్తోంది. టీడీపీ మహానాడులో మేనిఫెస్టోని ప్రకటించిన తర్వాత వైసీపీ నాయకులకి అసహనం ఎక్కువ అయ్యిందని అన్నారు. ఎలా అయిన భయభ్రాంతులకు గురి చేసి కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.

ముఖ్యంగా యువగళం పాదయాత్రకి ఆదరణ పెరుగుతుందని, రానున్న రోజుల్లో మరింతగా ఏపీ రాజకీయాలలో ఈ పాదయాత్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పొత్తులకి జనసేన ఒప్పుకోవడంతో తెలుగు దేశం పార్టీ మరింత యాక్టివ్ గా తన రాజకీయ వ్యూహాలు అమలు చేసుకుంటూ వెళ్తోంది. అయితే పొత్తులు విడగొట్టడానికి వైసీపీ మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోస్టర్లు కూడా ప్రధాన పట్టణాలలో ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. వీటిని జనసైనికులు బలంగా ఎదుర్కొంటూ వైసీపీని లక్ష్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానిలో ఏపీలో ఎన్నికలకి ఏడాది ముందే రాజకీయ వేడి రాజుకుందని చెప్పొచ్చు.

Varalakshmi

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 week ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.