AP Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరుకుంది అనే సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ప్రజలలో అసహనం పెంచుతున్నారు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం మీద రెండు పార్టీలు గొడవలు పడుతూ కొట్టుకునేంత వరకు వెళ్తున్నాయి. ప్రజా సమస్యలని వదిలేసి వ్యక్తిగత కక్ష సాదింపు చర్యలే ఎక్కువగా వైసీపీ, టీడీపీ మధ్య ఉన్నాయనే మాట వినిపిస్తుంది. తాజాగా అసెంబ్లీ వరకు రెండు పార్టీల మధ్య గొడవలు వచ్చేశాయి. ఏకంగా ఎమ్మెల్యేలు స్థాయి మరిచి అసెంబ్లీలో బాహాబాహీ గొడవ పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ ఘటనలో బాధ్యులుగా చూపిస్తూ స్పీకర్ 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు. అయితే వైసీపీ నాయకులే తమపైన భౌతిక దాడికి పాల్పడ్డారు అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే అసెంబ్లీ సాక్షిగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఇలా కొట్టుకునేంత వరకు వెళ్ళడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. గత నాలుగేళ్ళుగా జరుగుతున్న ఈ రాజకీయ కక్షసాదింపులు, ప్రజలలో కూడా అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కూడా వైసీపీని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న వ్యాఖ్యలు భవిష్యత్తుకి అద్దం పడుతున్నాయి.
టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం రోడ్డు మీద బట్టలు ఇప్పించి అందరిని కొడతాం అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే మీరు చేసిన ప్రతిదానికి బదులు తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇవి ఒకింత అశాంతిని పెంచే విధంగానే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ వైపు ప్రజలు చూస్తున్నారు అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరల ప్రశాంతత స్థితిలోకి వస్తుందని భావిస్తున్నారు. అందుకోసమే ఒంటరిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తుంది. ఈ రెండు పార్టీలు గొడవపడి పవన్ కళ్యాణ్ బలాన్ని రోజు రోజుకి పెంచుతున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Pawan Kalyan:హైదరాబాద్లో ఉస్తాద్ భగత్సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.