Vizag: ఆ మధ్య ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ ఏపీ రాజధాని విశాఖపట్నం అని, తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్న అంటూ సంచలన కామెంట్స్ చేశారు. మొన్నటి వరకు మూడు రాజధానులు అంటూ హడావిడి చేసి ఒక్కసారిగా ఏపీకి ఒకటే రాజధాని అది విశాఖపట్నం మాత్రమే అని చెప్పడం ద్వారా వైసీపీ స్టాండ్ మారిందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బెంగుళూరులో పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఐటీ మంత్రి అమర్నాథ్, ఆర్ధిక మంత్రి బుగ్గన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సెమినార్ లో ఏపీకి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ లేదని, కేవలం విశాఖపట్నం మాత్రమే రాజధాని అని చెప్పారు. అమరావతిలో కేవలం ఏడాదిలో ఒకసారి అసెంబ్లీ సమావేశాలు మాత్రమే జరుగుతాయని తెలిపారు. అలాగే కర్నూల్ లో ఏర్పాటు చేసేది హైకోర్టు బెంచ్ మాత్రమే అని చెప్పారు. విశాఖపట్నం నుంచి ప్రభుత్వం పరిపాలన మొదలుపెడుతుంది అని క్లారిటీ ఇచ్చారు. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉందని దానిని ఇస్తామని కూడా బుగ్గన, అమర్ నాథ్ తెలియజేశారు.
అలాగే మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ప్రైవేట్ పరిశ్రమలకి అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది అని తెలిపారు. ఇదిలా ఉంటే బుగ్గన చేసిన కామెంట్స్ ద్వారా మూడు రాజధానులు అంటూ వైసీపీ సర్కార్ ఇన్ని రోజులు ప్రజలని మోసం చేస్తూ వస్తుందనే ప్రచారాన్ని ప్రతిపక్షాలు తెరపైకి తీసుకొచ్చాయి. వారి దృష్టి అంతా విశాఖపట్నం మీదనే ఉందని, అక్కడి ప్రకృతి వనరులని ద్వంసం చేసి దోచుకోవడానికి రాజధానిగా మారుస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇన్ని రోజులు వారు చెప్పిన మాటని మళ్ళీ వారే అబద్ధం అని క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. అయితే మూడు రాజధానులు అంటూ మభ్య పెట్టిన వైసీపీకి ఇప్పుడు ఒకే రాజధాని అని చెప్పడం ద్వారా కచ్చితంగా రాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.
Pawan Kalyan:హైదరాబాద్లో ఉస్తాద్ భగత్సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.